E-Paper
Advertisement

Sharukh Khan : షారుఖ్ కు షాకిచ్చిన యాడ్.. నోటీసులు జారీ..

Sharukh Khan : షారుఖ్ కు షాకిచ్చిన యాడ్.. నోటీసులు జారీ..
Advertisement

Sharukh Khan : ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. స్టార్ రేంజ్ ఉన్న హీరోలు సినిమాలతో పాటు ఆడ్లను కూడా చేస్తూ ఉంటారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా అనేక యాడ్లను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన చేస్తున్న వాటిలో పాన్ మసాలా యాడ్ కూడా ఒకటి.. ఈ యాడ్ అందరిని బాగా ఆకట్టుకుంది. ఇందులో ఒక్కరు కాదు ముగ్గురు హీరోలు నటించారు. అయితే ఆ యాడ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు యాడ్ లో కనిపించిన ముగ్గురు పై ఫిర్యాధులు అందినట్లు తెలుస్తుంది. పాన్ మసాలా యాడ్ పై అభ్యంతరం ఎదురవ్వడంతో కొందరు ఫిర్యాదుల వల్ల కేసు నమోదు అయ్యింది. ఈ కేసు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అనేక యాడ్స్ చేస్తుంటారు. అందులో ఒకటి విమన్ పాన్ మసాలా.. ఈ యాడ్ ద్వారా తప్పుదారి పట్టించే విధంగా ఉందని జైపూర్‌కు చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లతో పాటు జెబి ఇండస్ట్రీస్ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.. ఈ ప్రొడక్ట్‌లోని ప్రతీ గింజలో కుంకుమ పువ్వు ఉందని ప్రకటన ఇవ్వడం ద్వారా తప్పుదారి పట్టిస్తున్నట్లు ఆరోపించింది. ఈ ఆందోళనల్ని పరిష్కరించడానికి వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా మార్చి 19న హాజరు కావాలని ఫోరం బాలీవుడ్ స్టార్స్ కు సమన్లు జారీ చేసింది..

Advertisement

Also Read : ఓరి నాయనో… సుమ అడ్డాకు అనుదీప్ మళ్లీ వచ్చిండ్రో…

ఈ ప్రోడక్ట్ లో నిజం లేదని కేవలం సేల్స్ కోసమే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ధరలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, ప్రకటనలో సాఫ్రాన్ ఉందని సూచించడం ద్వారా తప్పుగా సూచిస్తున్నారని వాదిస్తూ జైపూర్ నివాసి యోగేంద్ర సింగ్ బడియాల్ ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ప్రోడక్ట్ లో తప్పులు ఉన్నాయని చెబుతున్నారు. పలుకు పలుకుకి కుంకుమపువ్వు అని అందులో ట్యాగ్ ఇచ్చారు. కానీ నిజానికి కుంకుమపువ్వు కిలో ధర 4 లక్షల రూపాయలు ఉంది అలాంటి కుంకుమపువ్వుని ఎలా ఒక పాన్ మసాలాలో పెడతారని సదరు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఇలా తప్పుడు ప్రకటనలు ఇచ్చి హీరోలా స్టార్ ఇమేజ్ ని తగ్గించుకుంటున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గైర్సిలాల్ మీనా అధ్యక్షతన సభ్యురాలు హేమలతా అగర్వాల్ నేతృత్వంలోని ఫోరం, ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని, నటులకు, కంపెనీ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ ఫిర్యాదుతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. మరి దీని పై హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముగ్గురు హీరోలకు మంచి డిమాండ్ ఉంది. స్టార్ రేంజ్ లో ఉన్న వీరంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. షారుఖ్ ఖాన్ వయసుతో సంబంధం లేకుండా సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×