E-Paper
Advertisement

Sai Dharam Tej : వీరు పోట్లతో మెగా మేనల్లుడు మూవీ… పూర్తి డీటైల్స్ ఇవే..

Sai Dharam Tej : వీరు పోట్లతో మెగా మేనల్లుడు మూవీ… పూర్తి డీటైల్స్ ఇవే..
Advertisement

Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ (Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత ‘బ్రో’ అనే సినిమాలో తన మేనమామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో చేసి కాస్త డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. ఆ తరువాత ‘విరూపాక్షా’ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. సినిమా విజయం అయింది కానీ ఇందులో ఆయన పర్ఫామెన్స్ కాస్త తగ్గిందని, డాన్స్ విషయంలో కాస్త వెనుకబడ్డారు అని కొంతమంది విమర్శలు గుప్పించారు. దీంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీకి దూరమైనా.. తన మేనమామల దారిలోనే ఇతరులకు సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఆరు రోజుల క్రితం కూడా ఒక వ్యక్తి చికిత్సకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు సాయిధరమ్ తేజ్.

వీరు పోట్ల డైరెక్టర్ తో సాయిధరమ్ తేజ్ కొత్త మూవీ..

Advertisement

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష 2’ సినిమాతోపాటు ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా అంతలోనే మరో సినిమాకి ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా సాయిధరమ్ తేజ్ బిందాస్(Bindaas ) మూవీ డైరెక్టర్ వీరు పోట్ల (Veeru potla) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏ.కే.ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

సాయిధరంతేజ్ కెరియర్..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడిగా, సినీ రంగంలోకి అడుగుపెట్టారు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej). ‘పిల్ల నువ్వు లేని జీవితం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్.జే.భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న సాయి ధరమ్ తేజ్.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, తిక్క, విన్నర్, జవాన్, తేజ్ ఐ లవ్ యు వంటి పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తర్వాత సోలో బ్రతికే సో బెటర్ సినిమా తర్వాత ఆక్సిడెంట్ కి గురైన ఈయన.. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి కోమాలోకి కూడా వెళ్లిపోయారు. ఇక భగవంతుడి ఆశీస్సులు, కుటుంబ సభ్యులు,అభిమానుల ప్రార్థనలతో తిరిగి ఆరోగ్యవంతుడిగా మారారు సాయిధరమ్ తేజ్. ఇక యాక్సిడెంట్ కి గురికాక ముందు ఆయన నటించిన ‘రిపబ్లిక్’ సినిమాను 2021లో ఆక్సిడెంట్ తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేకపోయింది. ఇక 2023లో యాక్సిడెంట్ నుంచి కోలుకొని విరూపాక్ష సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ తనను తాను మార్చుకున్న సాయి ధరంతేజ్ ఇటీవల తన పేరును సాయి దుర్గ తేజ్ గా కూడా మార్చుకున్న విషయం తెలిసిందే. తన తల్లి దుర్గ పేరు మీదుగా తన పేరును సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నారు. ఇప్పుడు నటించబోయే సినిమాలతో భారీ సక్సెస్ అందుకోవాలని సాయి ధరమ్ తేజ్ అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×