Samantha: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ అంటే సమంత అని చెప్పాలి. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి సినిమాతోనే చాలామంది తెలుగు కుర్రకారును సైతం ఆకట్టుకుంది. ఇప్పటికీ సమంత కెరీర్ లో బెస్ట్ ఫిలిం అంటే ఏమాయ చేసావే అని చెప్పొచ్చు. తను నటించిన జెస్సీ పాత్ర చాలామందికి విపరీతంగా నచ్చేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది సమంత. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సైతం పని చేసింది. స్టార్ హీరోలతో పనిచేస్తున్న తరుణంలోని లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టింది.
కలిసిరాని వివాహ బంధం
ఏ మాయ చేసావే సినిమా తర్వాత సమంత అక్కినేని నాగచైతన్య ఇద్దరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చాలా సినిమాలు చేసిన తర్వాత. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల్లో పెళ్లికూడా చేసుకున్నారు. అయితే ఈ బంధం పెద్దగా కలిసి రాలేదు. వాళ్లకున్న కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయాడు. అలానే శోభితను పెళ్లి కూడా చేసేసుకున్నాడు. సమంత మరో వైపు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
Also Read : YELLAMMA : ఎల్లమ్మ సినిమా స్టోరీ లైన్ బాగుంది.. కానీ కన్ఫ్యూజ్ అంతా ఎల్లమ్మతోనే…?
ఆ పని చేయకండి
హీరోయిన్ సమంత తాజాగా SMలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనే సెషన్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అయింది. అందులో ఒక అభిమాని ‘ప్రేమికులు టాటూలు వేయించుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడగగా దానికి ఆమె సమాధానమిస్తూ.. “నా అభిమానులకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ప్రేమించుకుంటే ప్రేమించుకోండి పర్లేదు కానీ.. టాటూ మాత్రం వేయించుకోవద్దు. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి” అని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లికి ముందు నాగచైతన్య సమంత వీరిద్దరికీ కలిపి ఒకే రకమైన టాటూ ఉండేది అనే సంగతి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక సమంత ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న శుభం అనే సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను సమంత ప్రజెంట్ చేస్తుంది.
Also Read : PuriSethupathi : ఏంటి గురు రోజుకొకరుని యాడ్ చేస్తున్నావ్, ఏం ప్లాన్ చేసావ్ పూరి