E-Paper
Advertisement

Singer Pravasthi : శ్రీముఖి చెప్పమంటే చెప్పా.. నా వెనుక ఉన్నది మంగ్లీ అక్కనే.. సింగర్ ప్రవస్తి

Singer Pravasthi : శ్రీముఖి చెప్పమంటే చెప్పా.. నా వెనుక ఉన్నది మంగ్లీ అక్కనే.. సింగర్ ప్రవస్తి
Advertisement

Singer Pravasthi : ఇటీవల ‘పాడుతా తీయగా’ (Padutha Theeyaga) జడ్జిలు కీరవాణి (MM Keeravani), సింగర్ సునీత (Singer Sunitha), చంద్రబోస్ (Chandrabose) లపై షాకింగ్ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది సింగర్ ప్రవస్తి. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా ఇట్టే వైరల్ అవుతోంది. అందులో భాగంగా తాజాగా తన వెనుక ఉన్నది యాంకర్ శ్రీముఖి, సింగర్ మంగ్లీ అంటూ ఆమె కామెంట్స్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ప్రవస్తి ఏం చెప్పిందంటే ?

శ్రీముఖి, మంగ్లీ సపోర్ట్ 

Advertisement

సింగర్ ప్రవస్తి వివాదం బయటకొచ్చినప్పటి నుంచి ఆమె చెబుతున్నది ఒక్కటే మాట. “నాకు డబ్బు లేదు, పలుకుబడి లేదు. 12 ఏళ్ల వయసు నుంచే కుటుంబ భారాన్ని మోస్తున్నాను” అని. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో తనకు శ్రీముఖి, సింగర్ మంగ్లీ ఎలా సపోర్ట్ చేశారన్న విషయాన్ని ప్రవస్తి వెల్లడించింది.

అందులో ప్రవస్తి మాట్లాడుతూ “నేను మొదటి నుంచి ఎక్కడా నా పర్సనల్ విషయాలను, సమస్యలను బయట పెట్టలేదు. కానీ ఓ రోజు శ్రీముఖి అక్క నా దగ్గరకు వచ్చి యూ ఆర్ గోయింగ్ త్రూ సమ్ థింగ్… అదేంటో స్టేజ్ పై చెప్పు ఈరోజు అని అన్నారు. దీంతో స్టేజ్ పైనే నా బాధలను చెప్పుకున్నాను. ఇక అక్కడే ఉన్న మంగ్లీ అక్క దగ్గరకు వచ్చి మేము నీకు సపోర్ట్ చేస్తామని చెప్పింది” అంటూ ‘పాడుతా తీయగా’లో ఓ ఎపిసోడ్ లో జరిగిన సంఘటనను వెల్లడించింది. వివాదంతో శ్రీముఖి, మంగ్లీలకు ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రవస్తి నోటి వెంట వారిద్దరి పేర్లు రావడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.

Advertisement

అసలేం జరిగిందంటే?

యాంకర్ శ్రీముఖి సింగర్ ప్రవస్తి ఆరాధ్య పాల్గొన్న ‘పాడుతా తీయగా’ సింగింగ్ రియాలిటీ షోకు యాంకరింగ్ చేసింది. శ్రీముఖి తన యాంకరింగ్‌తో కార్యక్రమానికి జోష్ తీసుకొచ్చింది. ఈ షోలో ప్రవస్తి కంటెస్టెంట్‌గా పాల్గొని, తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆమె చివరి వరకూ కొనసాగలేదు. షో నుంచి ఎలిమినేట్ అయ్యాక ఆమె జడ్జిలపై చేసిన కామెంట్స్, సింగర్ ప్రవస్తి ఆరాధ్య వివాదం తెలుగు సంగీత రంగంలో సంచలనం రేకెత్తించింది.

Read Also : డైరెక్టర్ దగ్గరికి వెళ్తే… బట్టలు విప్పి చూపించు.. అని అన్నాడు.

ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే ‘పాడుతా తీయగా’ సింగింగ్ రియాలిటీ షోలో జడ్జిలైన సింగర్ సునీత, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనను కావాలనే టార్గెట్ చేశారని, బాడీ షేమింగ్ చేశారని, అన్యాయం చేశారని ప్రవస్తి ఆవేదనను వ్యక్తం చేసింది. కానీ సింగర్ సునీత ఈ వివాదంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ప్రవస్తి మాత్రం ఆమె చెప్పేవన్నీ అబద్దాలు అంటూ కొట్టి పారేసింది. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలి, దీనిపై చర్చిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×