Actor Suhas Prasanna Vadanam OTT Release: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సిరీ కెరీర్ను స్టార్ట్ చేశాడు సుహాస్. పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరించాడు. ఇక ఎవరికైనా ఓ ఛాన్స్ అనేది వస్తాది.. దానిని వినియోగించుకున్నవాడే ఉన్నతంగా ఎదుగుతాడు అనే దానికి సుహాస్ నిదర్శనం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసుకుంటున్న సుహాస్ కెరీర్ను ‘కలర్ ఫోటో’ మూవీ మార్చేసింది. ఈ మూవీలో అతడు హీరోగా ప్రమోషన్ పొందాడు. లవ్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ విపరీతంగా అలరించింది. ఫస్ట్ మూవీతోనే సుహాస్ బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఆ తర్వాత ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో వచ్చాడు. ఈ మూవీ కూడా ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించి నిర్మాతలకు లాభాల పంట పండించింది. దీంతో సుహాస్ క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్లో నటించి మెప్పించాడు. అనంతరం ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ సినిమాతో ప్రేక్షకుల్ని మనస్సులు దోచుకున్నాడు. లవ్ కాన్సెప్ట్ కలిగిన చిత్రాలతో హిట్లు అందుకున్న సుహాస్ ఇప్పుడు మరొక కొత్త కాన్సెప్ట్తో ఆడియన్స్ను అలరించాడు. సుహాస్ నటించిన కొత్త సినిమా ‘ప్రసన్నవదనం’. ఈ మూవీ ఈ రోజు (మే 3)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read: సుహాస్ ‘ప్రసన్నవదనం’ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే..?
సూర్య (సుహాస్)కు ఓ యాక్సెడెంట్ కారణంగా తలకు గట్టి గాయం అవుతుంది. దీంతో అతడికి ఫేస్ బ్లైండ్నెస్ అనే డిజార్డర్ సమస్య వస్తుంది. దీని కారణంగా అతడు వేరొకరి ఫేస్ను, వాయిస్ను గుర్తుపట్టలేడు. అంతేకాకుండా ఓ అమ్మాయిని కొందరు హత్య చేస్తారు. దానిని చూసిన సూర్య పోలీసులకు చెప్తాడు. దీంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు చివరికి సూర్యనే నిందితుడిగా పట్టుకుంటారు. దీంతో ఆ ట్వీస్టు అదిరిపోతుంది. మరి ఎవరో హత్య చేస్తే.. సూర్య ఎలా నిందితుడు అయ్యాడు. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. రిలీజ్కు ముందే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ను ఫిక్స్ చేసుకుందని తెలుస్తుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుందని సమాచారం.
Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో దిల్రాజు మరో మూవీ.. టైటిల్ ఇదే..!
దీంతో ఈ మూవీ థియేట్రికల్ రన్ అనంతరం ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారట. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్కు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో సుహాస్కు జోడీగా పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించారు. అలాగే రాశీసింగ్, వైవా హర్ష, నందు, సాయి శ్వేత, నితిన్ ప్రసన్నలు కీలక పాత్రల్లో అలరించారు.