E-Paper
Advertisement

Bollywood: పవిత్రమైన దేవాలయంలో నీచమైన పని… ఓర్రీపై కేసు ఫైల్..

Bollywood: పవిత్రమైన దేవాలయంలో నీచమైన పని… ఓర్రీపై కేసు ఫైల్..
Advertisement

Bollywood:ప్రముఖ సోషల్ మీడియా సంచలనం ఓర్రీ(Orry )(ఓర్హాన్ అవ్రతమణి ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఇతడిని కలవాలని, ఇతడితో ఫోటో దిగాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. అంత పాపులారిటీ దక్కించుకున్న ఇతడిపై తాజాగా జమ్మూకాశ్మీర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇతనితో పాటు మరో ఏడుగురిపై కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్ బీఎఫ్ఎఫ్ ఓర్రీ పవిత్ర దేవాలయం అయిన వైష్ణో దేవి మందిరం సమీపంలో మద్యం సేవించినందుకుగాను జమ్మూకాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఓర్రీ పై కేస్ ఫైల్..

Advertisement

ముఖ్యంగా వైష్ణో దేవి మాత దేవాలయం జమ్మూకాశ్మీర్ లోని కాత్రాలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మద్యం సేవించడం, మాంసాహారం తినడం నిషేధం. అలాంటి ప్రాంతంలో ఓర్రీ తన ఏడు మంది సన్నిహితులతో కలిసి మద్యం సేవించడంతో ఈ విషయం పోలీసుల వరకు చేరగా.. రంగంలోకి దిగిన పోలీసులు వీరిపై ఎఫ్ఐఆర్ (No.72/25) నమోదు చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు అలాగే మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు గానూ వారిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ లో ఓర్రీ తోపాటు అతని స్నేహితులు రష్యన్ జాతీయురాలు అనస్తాసిలా అర్జామస్కినా, దర్శన్ సింగ్, పార్థ్ రైనా, రితిక్ సింగ్, రాశి దత్త, షాగున్ కోహ్లీ, రక్షిత భోగల్ తోపాటు అర్జా మస్కినా లను ప్రాథమిక నిందితులుగా పేర్కొన్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇకపోతే హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటైన వైష్ణో దేవి మందిరానికి సమీపంలోని ఒక హోటల్లో వీరు మాంసాహారం తో పాటు మత్తు పదార్థాలు సేవించడం పై కేసు ఫైల్ చేశారు.

స్పందించిన ఎస్పీ రియాజ్..

Advertisement

ఇకపోతే ఈ విషయంపై స్పందించిన. ఎస్పీ..” కాత్రాతో పాటు కాత్రా సమీపంలో ఎవరైనా మద్యం సేవించడం, మాంసాహారం తినడం లాంటివి చేస్తే కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవు” అంటూ తెలిపారు. మొత్తానికైతే ఓర్రీతో పాటు మరో 7 మందిపై ఇప్పుడు కేస్ ఫైల్ అయింది. ఇక దీనిపై ఓర్రీ ఎలాంటి కామెంట్ చేస్తారో చూడాలి.

ఓరి కెరియర్..

కంటెంట్ సృష్టికర్తగా పేరు దక్కించుకున్న ఈయన.. సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయారు. బాలీవుడ్ తారలతో ఆయనకున్న సాన్నిహిత్యానికి ప్రసిద్ధి చెందారు. ముంబై వాసి అయిన ఈయన ఎక్కువగా బాలీవుడ్ పార్టీలకు హాజరవుతూ సెలబ్రిటీలను ఆకర్షిస్తూ ఉంటారు. అందులో భాగంగానే బాలీవుడ్ బ్యూటీలైన జాన్వీ కపూర్(Janhvi Kapoor) ,అనన్య పాండే(Ananya Pande), భూమి పడ్నేకర్ (Bhoomi Padnekar) ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) వంటి ,తారాలతో సన్నిహితంగా ఉంటూ .mవారితో కలిసి ఈవెంట్లకు వెళుతూ ఉంటారు. అంతేకాదు వీరితో కలిసి పబ్బులు, పార్టీలకు వెళ్లి సంచలనం సృష్టిస్తూ ఉంటారు. ఇక తెలుగు సెలబ్రిటీలైన సురేఖ వాణి (Surekha Vani) , సుప్రీతా (Supreetha ) వంటి సెలబ్రిటీస్ తో కూడా ఈయన సందడి చేసిన విషయం తెలిసిందే.

Star Hero:క్యాన్సర్ తో బాధపడుతున్న మెగాస్టార్..ఎట్టకేలకు స్పందించిన టీమ్..!

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×