E-Paper
Advertisement

Actor Naresh Tweet on HYD Heat: రాబోయే రోజులు మరింత దారుణంగా ఉంటాయి.. హెచ్చరించిన నటుడు నరేష్

Actor Naresh Tweet on HYD Heat: రాబోయే రోజులు మరింత దారుణంగా ఉంటాయి.. హెచ్చరించిన నటుడు నరేష్
Advertisement

Actor Naresh Tweet on Telangana Temperature: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. చేసిన ఏ పాత్రలో అయినా జీవించే గుణం ఆయనది. కడుపుబ్బా నవ్వించాలన్నా, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని ఏడిపించాలన్నా ఆయన తర్వాతే మరెవరైనా. ఒకప్పుడు హీరోగా చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో దూసుకుపోతున్నాడు.

గతంలో శ్రీ విష్ణు నటించిన ‘సామజవరగమన’ సినిమాలో హీరోకి తండ్రి పాత్రలో నటించి అదరగొట్టేశాడు. అందులో నరేష్ కామెడీ డైలాగ్‌ల టైమింగ్‌కి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. యంగ్ స్టార్‌లా కనిపిస్తూ నరేష్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సైతం అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది.

Advertisement

అయితే ఆ తర్వాత నరేష్ మరిన్ని సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. ఇకపోతే నరేష్ గతంలో తీవ్ర విమర్శలకు గురయ్యాడు. అతడు నటి పవిత్రను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సోషల్ మీడియా అంతటా వారి గురించే టాక్ నడిచింది. అంతేకాకుండా నరేష్ – పవిత్ర కలిసి బయటకు వెళ్లిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. అలా వీరిద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేశారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా పరాజయంపాలైంది.

Also Read: కృష్ణగారు పొత్తులు పెట్టుకోలేదు.. పవన్ పై నరేష్ సంచలన వ్యాఖ్యలు!

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా నరేష్ పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఎండ తీవ్రతకు చాలా మంది చనిపోయే పరిస్థితి ఏర్పడింది.

దీంతో ఈ విషయమై నటుడు నరేష్ సోషల్ మీడియా వేదికగా ప్రజలను అప్రమత్తం చేశాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇందులో భాగంగా నరేష్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘అనేక ప్రాంతాల్లో ఎండవేడి అధికంగా ఉంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతోంది.

అంతేకాదు ఈ ఎండ వేడికి క్యారవాన్‌లోని ఏసీలు కూడా పనిచేయడం లేదు. కొన్ని మూవీ యూనిట్‌లు ఎండ వేడిని తట్టుకోలేక షూటింగ్‌లను రద్దు చేసుకున్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి మిత్రులారా.. రాబోయే కొద్ది రోజులు మరింత దారుణంగా ఉంటాయి. కావున పని ఉంటేనే తప్ప బయటకు వెళ్లవద్దు. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి’’ అంటూ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. దీంతో అతడి ట్వీట్ వైరల్‌గా మారింది.

Also Read: Aashu Reddy: ఎద అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అషు రెడ్డి.. వీడియో మామూలుగా లేదు భయ్యా

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×