E-Paper
Advertisement

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ను ముంచెత్తిన వర్షాలు, 50 మంది మృతి

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ను ముంచెత్తిన వర్షాలు, 50 మంది మృతి
Advertisement

Heavy Rains In Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి.సెంట్రల్ ఆఫ్ఘనిస్థాన్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా సుమారు 50 మంది మృతి చెందారు. అనేక మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. శుక్రవారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్ ప్రాంతంలో రోడ్లు తెగిపోయాయని అంతే కాకుండా 200కు పైగా ఇళ్లు నేలమట్టం అయ్యాయని అధికారులు వెల్లడించారు.

ఫిరోజ్ లో 200 ఇళ్లు పూర్తిగా ధ్వసం అయ్యాయి. అంతే కాకుండా 4 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గత వారం ఆప్ఘన్ లో కురిసిన వర్షాలకు 315 మంది చనిపోయారు. బుధవారం ఘోర్ ప్రావిన్స్ లోని నదిలో పడిపోయిన వ్యక్తుల మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుండగా వైమానిక దళం హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కూలిపోగా ఒకరు మృతి చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

ఉత్తర ఆఫ్ఘనిస్థాన్ లో వేలాది ఇళ్లు దెబ్బతినడంతో పాటు అనేక పశువులు కూడా నీటిలో కొట్టుకుపోయాయని అక్కడి అధికారులు తెలిపారు. వరద నీరు పోటెత్తడంతో అనేక ప్రాంతాలు బురదతో నిండిపోయాయి. వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయాన్ని అందించాలని ఐక్యరాజ్య సమితి, మానవతా ఏజెన్సీలు, ప్రయివేటు వ్యాపారులను ఆ దేశ ఆర్థిక మంత్రి కోరారు. భారీ వరదలతో నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని అభ్యర్థించారు.

Also Read: తాలిబన్ దేశంలో వరదలు.. ఒక్కరోజులోనే 200 మంది మృతి

Advertisement

ఇదిలా ఉంటే వరద బాధితులకు WFO ఆహారం, సహాయం అందించేందుకు సిద్ధమైంది. బగ్లాన్ లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆహారం అందించడానికి ట్రక్కులు వెళ్లే పరిస్థితి లేదని దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను మొదలు పెట్టినట్లు WFO తెలిపింది.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×