E-Paper
Advertisement

Hajj pilgrims: మక్కాలో తీవ్రమైన వేడి.. 90 మంది భారతీయులు మృతి

Hajj pilgrims: మక్కాలో తీవ్రమైన వేడి.. 90 మంది భారతీయులు మృతి
Advertisement

Hajj pilgrims: పవిత్ర హజ్ యాత్ర విషాదాంతం అయింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో  ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండ వేడిమికి తట్టుకోలేక హజ్ యాత్రికులు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా యాత్రికులు మృతి చెందుతున్నారు. ఇక ఇప్పటికే హజ్ యాత్రికులు వెయ్యి మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే మరణించిన భారతీయుల సంఖ్యపై సౌదీ అధికారులు కానీ, భారత ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయి. ఈ సారి యాత్రలో 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన వారు ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు పేర్కొన్నారు. మరో రెండు లక్షల మంది సౌదీ అరేబియా వాసులని అన్నారు.

Advertisement

చనిపోయిన యాత్రికుల్లో వివిధ దేశాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నట్లు తెలిపారు. అంతే కాకుండా జోర్డాన్, ఈజిప్ట్, దేశాలకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. సుమారు 323 మంది ఈజిప్టుకు చెందిన వారు మరణించగా.. 90 మందికి పైగా జోర్డానియన్లు మరణించినట్లు తెలిపారు. అయితే చనిపోయిన వారిలో 90 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

Also Read: సముద్రంలో ఫిలిప్పీన్స్ నేవీపై కత్తులు, గొడ్డళ్లతో చైనా దాడి

Advertisement

జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలని ముస్లింలు భావిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా మక్కాను సందర్శించే హజ్ యాత్రికులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఈ ఏడు అత్యధిక సంఖ్యలో యాత్రికులు హజ్‌ను సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. కానీ ఎండ తీవ్రత వల్ల యాత్రకు వచ్చిన వారిలో చాలా మంది మరణించగా వేల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×