E-Paper
Advertisement

Plane Crash: టేకాఫ్ టైమ్‌లో మంటలు.. విమానంలో 173 మంది..

Plane Crash: టేకాఫ్ టైమ్‌లో మంటలు.. విమానంలో 173 మంది..
Advertisement

Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. డెన్వర్‌ నుంచి మియామికి వెళ్లేందుకు రన్‌వేపైన సిద్ధమైన విమానంలో మంటలను గుర్తించారు. వెంటనే ప్రయాణీకులను ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల ద్వారా బయటికి పంపారు. ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య కారణంగా మంటలు చెలరేగినట్టు గుర్తించారు. ప్రమాద సమయంలో విమానంలో 173 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో అంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలైనట్టు అధికారులు ప్రకటించారు. ఇక టైర్ మెయింటనెన్స్‌లో లోపంతోనే మంటలు వచ్చినట్టు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇక ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ దర్యాప్తు ప్రారంభించింది. మంటలను అదుపు చేసి విమానాన్ని తరలించామని ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రకటించింది.

Advertisement

Also Read: పకోడి, క్యాబేజీ కట్‌ చేస్తే ఆస్పత్రి.. స్కూల్లో 64 మందికి..

ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్‌ చూస్తుంటే ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. మంటలు, దట్టమైన పొగ విమానాన్ని కమ్మేసింది. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత మంటలను గుర్తిస్తే జరగరాని ఘోరం జరిగేదని చెబుతున్నారు నిపుణులు. విమానం టేకాఫ్‌ అయ్యే సమయంలోనే గ్రౌండ్ సిబ్బంది మంటలను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×