E-Paper
Advertisement

Plane Crash: టేకాఫ్ టైమ్‌లో మంటలు.. విమానంలో 173 మంది..

Plane Crash: టేకాఫ్ టైమ్‌లో మంటలు.. విమానంలో 173 మంది..
Advertisement

Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. డెన్వర్‌ నుంచి మియామికి వెళ్లేందుకు రన్‌వేపైన సిద్ధమైన విమానంలో మంటలను గుర్తించారు. వెంటనే ప్రయాణీకులను ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల ద్వారా బయటికి పంపారు. ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య కారణంగా మంటలు చెలరేగినట్టు గుర్తించారు. ప్రమాద సమయంలో విమానంలో 173 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో అంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలైనట్టు అధికారులు ప్రకటించారు. ఇక టైర్ మెయింటనెన్స్‌లో లోపంతోనే మంటలు వచ్చినట్టు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇక ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ దర్యాప్తు ప్రారంభించింది. మంటలను అదుపు చేసి విమానాన్ని తరలించామని ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రకటించింది.

Advertisement

Also Read: పకోడి, క్యాబేజీ కట్‌ చేస్తే ఆస్పత్రి.. స్కూల్లో 64 మందికి..

ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్‌ చూస్తుంటే ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. మంటలు, దట్టమైన పొగ విమానాన్ని కమ్మేసింది. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత మంటలను గుర్తిస్తే జరగరాని ఘోరం జరిగేదని చెబుతున్నారు నిపుణులు. విమానం టేకాఫ్‌ అయ్యే సమయంలోనే గ్రౌండ్ సిబ్బంది మంటలను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×