BigTV English
Advertisement

Plane Crash: టేకాఫ్ టైమ్‌లో మంటలు.. విమానంలో 173 మంది..

Plane Crash: టేకాఫ్ టైమ్‌లో మంటలు.. విమానంలో 173 మంది..

Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. డెన్వర్‌ నుంచి మియామికి వెళ్లేందుకు రన్‌వేపైన సిద్ధమైన విమానంలో మంటలను గుర్తించారు. వెంటనే ప్రయాణీకులను ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల ద్వారా బయటికి పంపారు. ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య కారణంగా మంటలు చెలరేగినట్టు గుర్తించారు. ప్రమాద సమయంలో విమానంలో 173 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో అంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.


ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలైనట్టు అధికారులు ప్రకటించారు. ఇక టైర్ మెయింటనెన్స్‌లో లోపంతోనే మంటలు వచ్చినట్టు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇక ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ దర్యాప్తు ప్రారంభించింది. మంటలను అదుపు చేసి విమానాన్ని తరలించామని ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రకటించింది.

Also Read: పకోడి, క్యాబేజీ కట్‌ చేస్తే ఆస్పత్రి.. స్కూల్లో 64 మందికి..


ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్‌ చూస్తుంటే ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. మంటలు, దట్టమైన పొగ విమానాన్ని కమ్మేసింది. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత మంటలను గుర్తిస్తే జరగరాని ఘోరం జరిగేదని చెబుతున్నారు నిపుణులు. విమానం టేకాఫ్‌ అయ్యే సమయంలోనే గ్రౌండ్ సిబ్బంది మంటలను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×