Thailand: థాయ్లాండ్లోని ఓ స్కూల్లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. నిందితుడు తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బ్యాంకాక్కు ఉత్తరాన నోంతబురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అసలు ఏం జరిగింది.
థాయిలాండ్ నోంతబురి ప్రాంతంలోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విచక్షణా రహితంగా తోటి విద్యార్థులు, టీచర్లను కాల్చాడు ఒక విద్యార్థి. ఆ తర్వాత తనను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
నిందితుడితోపాటు విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. దాదాపు 15 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంబులెన్సులను రప్పించి గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై థాయ్లాండ్ విద్యాశాఖ మంత్రి వాంగ్థాంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆ పాఠశాలలో చదువుతున్నాడు. ఆ విద్యార్థి పేరు, వయస్సు, ఘటనకు దారితీసిన కారణాలు, ఆయుధాన్ని ఎలా సంపాదించాడనే విషయాలు వెల్లడించలేదు.
ఘటన జరిగిన సమయంలో పాఠశాలలో సుమారు 3 వేల మంది విద్యార్థులు, 147 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కాల్పుల ఘటనతో పాఠశాలలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల సందడితో కళకళలాడే పాఠశాల, క్షణాల్లో అక్కడి పరిస్థితి మారిపోయింది.
ALSO READ: సంతకాలతో భయపెడుతున్న ట్రంప్.. భారతీయులకు ఊహించని షాక్
థాయిలాండ్ పాఠశాలల్లో కాల్పుల ఘటనలు చాలా అరుదు. ఇటీవల వరుస సంఘటనలు అక్కడి తల్లిదండ్రులను ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ థాయిలాండ్లోని హాట్యాయ్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఓ విద్యార్థి గాయపడిన విషయం తెల్సిందే.