Elon Musk India Tour Cancelled: టెస్లా కంపెనీ చీఫ్ ఎలాన్ మస్క్ భారత టూర్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ముఖ్యంగా టెస్లాకు సంబంధించి ముఖ్యమైన బాధ్యతల కారణంగా పర్యటన డిలే అవుతుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆయన.
షెడ్యూల్ ప్రకారం ఈనెల 21, 22న పర్యటించాల్సి ఉంది. ఈ టూర్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో ఆయన భేటీ జరగాల్సివుంది. ఇండియాలో పెట్టుబడుల గురించి ఆయన ప్రకటన చేస్తారని భావించారు. ఈలోగా టూర్ వాయిదా పడింది. టెస్లా కంపెనీ భారత్లోకి ప్రవేశిస్తుందని కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. గతంలో పలువురు కేంద్రమంత్రులు ఈ వ్యవహారంపై మాట్లాడారు.
విద్యుత్ కార్లకు ఇండియా పెద్ద మార్కెట్ కావడంతో మస్క్ దృష్టి ఇటువైపు పడింది. ఇండియాలో తయారీ కేంద్రం ఏర్పాటుకు ఆ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించినట్టు సమాచారం. వాటిలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు లేదా మూడు బిలియన్ డాలర్లు వరకు పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Also Read: PM Modi On Mahaveer Jayanti: మహవీర్ జయంతి.. 2550వ నిర్వాణ మహోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..
కొన్నాళ్ల కిందట ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యవహారంపై ఇన్డైరెక్ట్గా మాట్లాడారు. భారత్కు పెట్టుబడులు రావాలని తాను కోరుకుంటున్నానని, ఇక్కడ ఎవరు పెట్టుబడి పెడతారనేది ముఖ్యం కాదన్నారు. తయారీ రంగంలో ఇక్కడ ప్రజల ముద్ర ఉండాలన్నారు. అప్పుడే మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.