E-Paper
Advertisement

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

New York Bus  Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Advertisement

New York Bus Accident: అమెరికా న్యూయార్క్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత నయాగరా వాటర్‌ఫాల్స్‌ అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్‌కు వస్తున్న ఓ టూరిస్టు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన పెంబ్రోక్‌ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందడంతో పాటు పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.

డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా !
బస్సును వేరే ఇతర వాహనం ఢీకొట్టలేదని, డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనేదానిపై సమాచారం లేదు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడిన విషయం తెలియడంతో వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు హెలికాప్టర్‌లు, పలు అంబులెన్స్‌లలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి.

Advertisement

Also Read: రచ్చ రేపుతున్న కావలి పాలిటిక్స్..

పర్యాటకుల్లో అత్యధికులు భారత్‌, చైనాకు చెందిన వారు !
ఈ ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పర్యాటకుల్లో అత్యధికులు భారత్‌, చైనాకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదొక విషాద ఘటన అని న్యూయార్క్‌ గవర్నన్‌ క్యాథీ హోచుల్‌ పేర్కొన్నారు. తమ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు.

Advertisement

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×