E-Paper
Advertisement

Zaporizhzhia nuclear plant: జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలు

Zaporizhzhia nuclear plant: జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలు
Advertisement

Zaporizhzhia nuclear plant: ఐరోపాకు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా? రష్యా-ఉక్రెయిన్ వార్‌లో అసలేం జరుగుతోంది? ఉక్రెయిన్‌తో రష్యా పోరాటం చేయలేకపోతోందా? పైచేయి సాధించేందుకు రష్యా ఎత్తుకు పైఎత్తులు వేస్తోందా? జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ మంటల వెనుక అసలు కారణమేంటి? ఇలా రకరకాల ప్రశ్నలను యూరప్ దేశాలను వెంటాడుతున్నాయి.

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నెలల తరబడి సాగుతోంది. ఉక్రెయిన్‌ను పూర్తిగా డ్యామేజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కనబడుతోంది. వార్‌లో భాగంగా రెండేళ్ల కిందట జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌ను రష్యా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ తర్వాత అక్కడ విద్యుత్‌ని నిలిపివేశాయి. అంతేకాదు ఆ రియాక్టర్లను నాలుగునెలల కిందట కోల్డ్ షట్ డౌన్‌లో ఉంచారు. ఏం జరిగిందో తెలీదుగానీ.. ఆదివారం ఈ ప్లాంట్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

Advertisement

న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలపై రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మంట ల వెనుక రష్యా సైన్యం హస్తముందన్నది ఉక్రెయిన్ ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా కీవ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ చర్యకు పాల్పడినట్టు అనుమానిస్తోంది. రష్యా కూడా ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఉక్రెయిన్ బలగాల వల్లే ఇదంతా జరుగుతోందని అంటోంది.

ALSO READ: హోటల్‌పై కుప్పకూలిన హెలికాప్టర్..పైలట్ దుర్మరణం

Advertisement

ఇదిలావుండగా జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌లో చెలరేగిన వ్యవహారంపై ఆ ప్రాంత గవర్నర్ రియాక్ట్ అయ్యారు. మంటలను అక్కడి విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలు పూర్తిగా ఆర్పివేసినట్టు చెప్పు కొచ్చారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సమస్యలేదన్నది అక్కడి అధికారుల మాట. ప్రస్తుతం జరిగిన ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×