E-Paper
Advertisement

USA: అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్.. 23 రోజుల్లో 36 ఘటనలు

USA: అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్.. 23 రోజుల్లో 36 ఘటనలు
Advertisement

USA: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఓవైపు తుపాకీ నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కాల్పుల ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఈ ఏడాది తొలి 23 రోజుల్లోనే 36 ఘటనలు చోటుచేసుకున్నాయి. రోజుకు ఒక్క చోట అయినా కాల్పులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. కాలు బయట పెట్టాలంటేనే ఆలోచిస్తున్నారు.

గడిచిన 48 గంటల్లో నాలుగు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. శనివారం రాత్రి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్‌లో ఓ డ్యాన్స్ క్లబ్ వద్ద దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 11 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా ఆత్మ హత్య చేసుకున్నాడు.

Advertisement

ఈ ఘటన మరువక ముందే ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బే ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది ఇలా ఉండగా సోమవారం తెలుగు విద్యార్థులపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన నందపు దేవ్‌శిష్ అనే విద్యార్థి మృతి చెందగా.. సాయి చరణ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

2022లో మొత్తం 647 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు 44 వేల మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో జనాలు గాయాలపాలయ్యారు. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×