E-Paper
Advertisement

India Defence Exports Developed Nations: అగ్ర దేశాలకు భారత ఆయుధ సామగ్రి.. హైదరాబాద్ కంపెనీలే కీలకం

India Defence Exports Developed Nations: అగ్ర దేశాలకు భారత ఆయుధ సామగ్రి.. హైదరాబాద్ కంపెనీలే కీలకం
Advertisement

India Defence Exports Developed Nations| భారతదేశం, గతంలో రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడినప్పటికీ, ఇప్పుడు అదే ఉత్పత్తులను అగ్రదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. రక్షణ ఉత్పత్తుల్లో ఈ మార్పు పరిశ్రమ వర్గాలను ఆకట్టుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.21,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా గత ఏడాదితో (2022-23) పోల్చితే 32.5% వృద్ధి సాధించింది.

రక్షణ ఎగుమతుల్లో 75% ప్రభుత్వ రంగ సంస్థల వాటాగా ఉండగా, మిగిలిన వాటిని ప్రైవేటు కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఈ రంగంలో ప్రైవేటు సంస్థల వాటా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా, హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

Advertisement

100కు పైగా దేశాలకు ఎగుమతులు
భారతదేశం నుంచి రక్షణ ఉత్పత్తులను అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా మొదటిస్థానంలో ఉన్నాయి. అమెరికా సంస్థలు సిస్టమ్స్, సబ్‌సిస్టమ్స్, విడిభాగాలను కొనుగోలు చేస్తున్నాయి. పినాకా మల్టీ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్స్, 155 ఎంఎం ఆర్టిలరీ గన్లు, ఆకాశ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైల్‌ సిస్టమ్స్ వంటి ఆయుధాలను ఆర్మేనియా దేశం కొనుగోలు చేస్తోంది. వియత్నాం కోస్ట్‌ గార్డ్‌కు ఇంటర్‌సెప్టర్‌ బోట్లు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఇవే కాకుండా బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ మిస్సైళ్లను కూడా వియత్నాం కొనుగోలు చేయాలనుకుంటోంది.

ప్రస్తుతం భారతదేశం దాదాపు 100కు పైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

Advertisement

Also Read:  ప్రపంచ జనాభా తగ్గుతోంది.. మరో 100 సంవత్సరాల్లో 20-50 శాతం తగ్గుదల!

ఆయాధాలు, రక్షణ పరికరాల ఉత్పత్తిలో భారీ పెరుగుదల
భారతదేశంలో రక్షణ ఉత్పత్తుల ఉత్పత్తి, ఎగుమతులు పెరిగేందుకు కేంద్ర ప్రభుత్వం పలు విధాన మార్పులు తీసుకువచ్చింది. ప్రస్తుతం 16 ప్రభుత్వ రక్షణ సంస్థలు, 430కి పైగా ప్రైవేటు సంస్థలు, 16,000 ఎంఎస్‌ఎంఈలు ఈ రంగంలో పనిచేస్తున్నాయి.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావం
ఇటీవలి రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఉద్రిక్తతలు రక్షణ పరికరాల డిమాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచాయి. ఆసియా దేశాల్లో చైనా చర్యల కారణంగా అభద్రతా భావం పెరగడంతో ఇండోనేసియా, మలేసియా, వియత్నాం వంటి దేశాలు తమ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాయి.

హైదరాబాద్‌ కేంద్రంగా కీలక పాత్ర
హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు రక్షణ ఉత్పత్తుల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, బీడీఎల్‌, మిధాని వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, వందకు పైగా ప్రైవేటు సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు రక్షణ పరికరాలను ఉత్పత్తి చేస్తున్నాయి.

ప్రముఖ ఎగుమతి ఉత్పత్తుల జాబితా
బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, హెల్మెట్లు
బ్రహ్మోస్‌ మిస్సైళ్లు
పినాకా రాకెట్లు
ఆర్టిలరీ గన్లు
తేజస్‌ యుద్ధ విమానాల విడిభాగాలు
ఇంటర్‌సెప్టర్‌ బోట్లు
తేలికపాటి టోర్పెడోలు

భారతదేశం త్వరలో మరింత భారీ ఎగుమతులకు సిద్ధమవుతోంది. 2029 నాటికి రూ.50,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతోంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×