E-Paper
Advertisement

India vs China: పేర్లు మారితే నిజాలు మారవ్.. చైనాపై భారత్ సీరియస్

India vs China: పేర్లు మారితే నిజాలు మారవ్.. చైనాపై భారత్ సీరియస్

India vs China: పాకిస్థాన్‌తో చైనా తోక కూడా వంకరే. ఇది ఇప్పటికే అనేక సార్లు ప్రూవ్ అయ్యింది కూడా. ఇప్పుడు మరోసారి తమ బుద్ది ఏం మారలేదని ప్రూవ్ చేసుకోంది డ్రాగన్ కంట్రీ చైనా. మరోసారి అరుణాచల్ ప్రదేశ్ తనదే అంటూ చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఈసారి ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ పేరును జంగ్నాన్‌గా వ్యవహరిస్తూ.. టిబెట్‌ దక్షిణ ప్రాంతం అని తన మ్యాప్‌లో చూపించింది. కానీ విదేశాంగశాఖ ఈసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. పేర్లు మార్చుకున్నంత మాత్రానా.. నిజాలు మారుతాయా? అంటూ కౌంటర్ ఇచ్చింది.

చైనా మరోసారి తన తీరును మార్చుకోవడం లేదని.. మరోసారి తనవి కాని ప్రాంతాలకు పేర్లు పెట్టే బుద్ధి పోనిచ్చుకోలేదంటూ విదేశాంగశాఖ తెలిపింది. ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని సూచించింది. క్రియేటివ్‌గా పేర్లు పెట్టినంత మాత్రానా.. అరుణాచల్ వారి సొంతమై పోదని.. అరుణాచల్ ప్రదేశ్‌ అనేది మొదటి నుంచి భారత్‌లో అంతర్భాగంగానే ఉందని.. ఇకపై కూడా ఉంటుందని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది.

2024లో అరుణాచల్ ప్రదేశ్‌ను తమ ప్రాంతంగా చెబుతూ.. అందులోని 30 ప్రాంతాలకు కొత్త పేర్లు సూచించింది. అరుణాచల్ ప్రదేశ్‌పైనే ఇరు దేశాల మధ్య చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే టిబెట్‌ను తనలో కలిపేసుకున్న చైనా.. దాని సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ కూడా టిబెట్‌లో అంతర్భాగమనే వాదన వినిపిస్తూ వస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు కేంద్రం డ్రాగన్ కంట్రీకి కౌంటర్లు ఇస్తూ వస్తోంది.

2017 నుంచి ఈ పేర్లు మార్చే పనులను ప్రారంభించింది చైనా. మొదట అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు పేర్లు మార్చింది.. 2021లో 15 ప్రాంతాల పేర్లు మార్చింది. 2023లో మరో 11 ప్రాంతాల పేర్లు మార్చింది. 2024లో ఏకంగా 30 ప్రాంతాల పేర్లు మార్చింది. ఇందులో 12 మౌంటేన్ ఏరియాలు ఉండగా.. నాలుగు నదులు, ఒక సరస్సు, 11 నివాస ప్రాంతాలు ఉన్నాయి.

పాకిస్థాన్‌ తానా అంటే.. చైనా తందానా అనడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల మాట్లాడినప్పుడు.. న్యూక్లియర్ శక్తి ఉన్న దేశాల బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు.

Also Read: సింధు జలాలపై ఆంక్షలు కొనసాగితే కాల్పుల విరమణ కొనసాగదు.. పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

అదంపూర్ ఎయిర్‌బేస్‌లో పర్యటించిన సమయంలో ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు అటు పాకిస్థాన్‌తో పాటు.. ఇటు చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. భారత్‌ జోలికి వస్తే.. ఎవరినైనా మట్టికరిపిస్తామని చెబుతున్నారు ప్రధాని మోడీ.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×