E-Paper
Advertisement

Iran election 2024 results: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసౌద్ విజయం, పాలన ఎలా ఉంటుంది?

Iran election 2024 results: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసౌద్ విజయం, పాలన ఎలా ఉంటుంది?
Advertisement

Iran election 2024 results: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసౌద్ పెజెష్కియాన్ గెలుపొందారు. ఆయనకు 1.63 కోట్ల ఓట్లు వచ్చినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల్లో దాదాపు మూడు కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. సయూద్‌కు 1.35 కోట్ల ఓట్లు మాత్రమే వచ్చాయి.

మసౌద్‌ అధ్యక్షుడి పగ్గాలు అందుకోనున్నారు. సంస్కరణవాదిగా మసౌద్ మంచి పేరుంది. వృత్తిరీత్యా ఆయన వైద్య నిఫుణుడు కూడా. మసౌద్ గెలుపుతో ఆ దేశంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టే అవకాశముంద ని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా ఇరాన్ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు మొగ్గు చూపలేదు. కేవలం 60శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించు కున్నారు.

Advertisement

పోలైన ఓట్లలో 50శాతం వచ్చినవారు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. లేకుంటే రనాఫ్ పోలింగ్ నిర్వహిస్తారు. అందులో విజేతను ప్రకటిస్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మసౌద్.. ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పారు. దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారాయన. అందరికీ స్నేహ హస్తం అందిస్తామన్నారు. మనమందరం దేశ ప్రజలమని గుర్తు పెట్టుకోవాలన్నారు.

ALSO READ:  బ్రిటన్ ప్రధాని కీర్‌తో కేసీఆర్ మనవడు హిమాన్షు, ఆపై అభినందనలు

Advertisement

వెస్ట్రన్ దేశాలతో నిర్మాణాత్మకమైన సంబంధాలను నెలకొల్పుతానని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు మసౌద్. ఒంటరితనం నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడానికి కృషి చేస్తానని, అణు ఒప్పందాన్ని పునరుద్దరించాలన్నారు. గత అధ్యక్షుడు 63 ఏళ్ల ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ క్రమంలో ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మసౌద్ పెజెష్కియాన్- సయూద్ జలిలిలు పోటీ పడ్డారు. చివరకు మసౌద్ విజయం సాధించారు.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×