E-Paper
Advertisement

Nepal EarthQuake: నేపాల్‌లో భారీ భూకంపం..53 మంది మృతి, ఊహించని నష్టం

Nepal EarthQuake: నేపాల్‌లో భారీ భూకంపం..53 మంది మృతి, ఊహించని నష్టం

Nepal EarthQuake: దేవ భూమిగా పేరుగాంచిన నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. లుబుచేకు 93 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.1గా నమోదైంది.

నేపాల్‌లో మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో భారీగా భూకంపం సంభవించింది. భూమి భారీగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పలు చోట్ల వస్తువులు కిందపడ్డాయి. చాలా ఇళ్లు బీటలు వారాయి. తీవ్రత  గురించి అధికారులు ఇప్పుడిప్పుడే అంచనాకు వస్తున్నారు.

నేపాల్ నుంచి వివిధ వార్తల సంస్థల ద్వారా అందుతున్న సమాచారం మేరకు..  భూకంపంలో ఇప్పటి వరకు కనీసం 53 మంది మృతి చెందారు. మరో 62 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నాయి. తొలుత వచ్చిన భూకంపం తర్వాత టిబెట్ రీజియన్‌లో మళ్లీ రెండు సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే వీటి తీవ్రత 4.7, 4.9గా రిక్టర్ స్కేల్‌పై నమోదయ్యాయి.

హిమాలయ ప్రాంతం కావడంతో భూకంపం వల్ల అధికంగా డ్యామేజ్ జరిగిన ప్రాంతానికి అధికారులు వెళ్లలేకపోతున్నారు. రోడ్లు డ్యామేజ్‌తో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు కమ్యూనికేషన్ వ్యవస్థ సైతం దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ALSO READ: కెనడాలో ఏం జరుగుతోంది? ప్రధాని రాజీనామా వెనుక కారణం ఏమిటీ? అసలేం జరుగుతోంది?

పదేళ్ల కిందట 2015లో వచ్చిన భూకంపం నుంచి ఇప్పుడిప్పుడు అక్కడి ప్రజలు తేరుకుంటున్నారు. ఆనాడు జరిగిన ఘటనలో దాదాపు 9000 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. గాయపడిన వారి సంఖ్య 22 వేలు. అప్పట్లో  రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదయ్యింది.

ఐదు దాటితే తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఏడు వరకు నమోదు కావడంతో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నేపాల్ అధికారుల మాట. రోడ్లు, కమ్యూనికేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిన్న భూప్రకంపనలు సహజంగా అక్కడ వస్తుంటాయి. ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై పడింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం.

 

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×