E-Paper
Advertisement

Pakistan Senator: భారత్ పాకిస్థాన్‌కు తేడా అదే.. దాయాది ప్రభుత్వాన్ని ఏకి పారేసిన సెనేటర్..

Pakistan Senator: భారత్ పాకిస్థాన్‌కు తేడా అదే.. దాయాది ప్రభుత్వాన్ని ఏకి పారేసిన సెనేటర్..

Pakistan Senator Praised India: పాకిస్తాన్ సెనేట్ ప్రతిపక్ష నాయకుడు షిబ్లీ ఫరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, భారతదేశ ఎన్నికల వ్వవస్థపై తేడాలనే నొక్కి చెప్పారు. ఇటీవలి ముగిసిన భారత సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని.. కానీ పాక్ ఎన్నికల్లో మాత్రం రిగ్గింగ్ జరుగుతోందని విరుచుకుపడ్డారు.

భారతదేశం సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహిస్తోందని ప్రశంసించారు. పాక్‌లో శాంతియుతంగా అధికార మార్పిడిని నిర్ధారించడానికి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించలేకపోతున్నారని సొంత దేశాన్ని ఏకిపారేశారు.

భారతదేశంలో ఇటీవలే ఎన్నికలు ముగిశాయన్నారు ఫరాజ్. దాదాపు 800 మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేల సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు ఉన్నాయ్నారు. భారత పోలింగ్ వ్వవస్థ ఎంత అభివృద్ధి చెందిందంటే మారుమూల ప్రాంతంలో నివసించే వ్యక్తి కోసం కూడా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారన్నారు. అయినా ఎక్కడ కూడా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఒక్క స్వరం కూడా వినిపించలేదని ఇస్లామాబాద్‌లో జరిగిన పార్లమెంటు సమావేశంలో షిబ్లీ ఫరాజ్ అన్నారు.

పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ సభ్యుడైన ఫరాజ్, గతంలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో బహుళ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.

Also Read: కాంగోలో పడవ బోల్తా, 86 మంది మృతి.. కారణం అదే..

ఓడిపోయిన అభ్యర్థులు ఓటమిని అంగీకరించడానికి నిరాకరించిన పాకిస్తాన్ ఎన్నికలలో అనేక వివాదాలు జరిగాయని ఫరాజ్ తన నిరాశను వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌లోని ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎన్నికలను ఎందుకు నిర్వహించలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. ముస్లిం లీగ్, ఎమ్‌క్యూఎంతో సహా అన్ని పార్టీల స్వార్థ ప్రయోజనాలే ఇందుకు కారణమని ఆయన తేల్చిచెప్పారు.

పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి 1,300 ఫిర్యాదులు అందాయి. కౌంటింగ్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా పలు స్థానాల ఫలితాలను ఇప్పటివరకు పోల్ అధికారులు ప్రకటించలేదు.

ఐక్యరాజ్యసమితి, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి పరిశీలకులు కూడా పాకిస్తాన్‌లో ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు జరిగిన రిగ్గింగ్‌ను ఎత్తి చూపారు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×