E-Paper
Advertisement

IT: నైపుణ్యం పెంచుకుంటేనే ఉద్యోగ భద్రత..

IT: నైపుణ్యం పెంచుకుంటేనే ఉద్యోగ భద్రత..
Advertisement

IT: ఐటీ రంగంలో గందరగోళం నెలకొంది. మాంద్యం దెబ్బకు దిగ్గజ కంపెనీలు కూడా దివాళా తీస్తున్నాయి. కరోనా సమయంలో పోటీ పడి మరీ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు.. ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. భారతీయ ఐటీ పరిశ్రమ ఎక్కువగా అమెరికాపై ఆధారపడినందున అక్కడి ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంది.

ఇప్పటి వరకు మన దేశంలో దాదాపు 50 వేల మంది తమ ఉద్యోగాన్ని కోల్పోయారు. త్వరలోనే ఈ సంఖ్య డబుల్ అయ్యే ఛాన్స్ ఉందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో తొలగింపులు భారీగా ఉంటాయని.. ఈ ఏడాది మొత్తం తొలగింపుల పర్వం కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.

Advertisement

అయితే సాంకేతిక మార్పుల కారణంగా ప్రస్తుతం ఉద్యోగాలు భారీగా తగ్గిపోతున్నప్పటికీ.. అతి త్వరలోనే అధికంగా కొత్త టెక్నాలజీలో ఉద్యోగాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డిజిటల్ సాంకేతికతల్లో కొత్త ఉద్యోగాలు భారీగా లభిస్తాయని చెబుతున్నారు. ఐదేళ్ల కోసారి ఐటీ రంగంలో సాంకేతిక మార్పులు రావడం సహజమేనని, పాత నైపుణ్యాలకే పరిమితమైన వారి ఉద్యోగాలు పోవడం సాధారణమేనని తెలిపారు.

ఎవరైతే తాజా అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారో.. కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటారో వారికి ఉద్యోగ భద్రత ఉంటుందని ఐటీ రంగ పరిశీలకులు చెబుతున్నారు. పదేళ్ల నాటి నైపుణ్యాలతో ఇప్పుడు పనిచేసే పరిస్థితి ప్రస్తుతం ఐటీ రంగంలో లేదని స్పష్టం చేశారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×