BigTV English
Advertisement

Sheikh Hasina: యూకే రెడ్ సిగ్నల్? అప్పటి వరకు భారత్‌లోనే షేక్ హసీనా? గతంలోనూ ఇది పరిస్థితి!

Sheikh Hasina: యూకే రెడ్ సిగ్నల్? అప్పటి వరకు భారత్‌లోనే షేక్ హసీనా? గతంలోనూ ఇది పరిస్థితి!

Sheikh Hasina latest news(International news in telugu): బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎక్కడున్నారు? భారత్‌లోనా.. యూకేలోనా .. ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. తాజాగా యూకేలో ఉండేందుకు ఆమెకు ఇంకా అనుమతులు రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


సోమవారం బంగ్లాదేశ్ నుంచి బయలుదేరిన మాజీ ప్రధాని షేక్ హసీనా నేరుగా ఇండియాకు చేరుకున్నారు. అక్కడి నుంచి బ్రిటన్‌కు వెళ్తారనే వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లో ఆశ్ర‌యం పొందేందుకు ఆమె భార‌త్‌లో ఉండే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంలో యూకే నుంచి ఇప్ప‌టివరకు అనుమ‌తి ల‌భించ‌లేద‌ని ‘డైలీ స‌న్’ తెలిపింది. ఆమెకు తాత్కాలిక ఆశ్ర‌యం క‌ల్పించిన భార‌త్.. అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం.

ఇదిలావుండగా షేక్ హసీనా గతంలో భారత్‌లో ఆరేళ్లపాటు ఆశ్రయం పొందింది. 1975లో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌తో సహా తన కుటుంబాన్ని బంగ్లాదేశ్‌లో ఊచకోత కోశారు. ఆ సమయంలో హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. షేక్ హసీనా తన భర్త, పిల్లలు, సోదరితో కలిసి 1975 నుండి 1981 వరకు ఆరేళ్లపాటు ఉన్నారు. ఢిల్లీలోని లజ్‌పత్ ప్రాంతంలోని పండారా రోడ్‌ ఏరియాలో నివసించిన విషయం తెల్సిందే.


ALSO READ: బంగ్లాదేశ్ పరిస్థితిపై భారత్ ఏమనుకుంటోంది?

రాజకీయ శరణార్ధిగా యూకెలో ఉండేందుకు మాజీ ప్రధాని షేక్ హసీనా ఆశ్రయం కోరినట్టు తెలుస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. హసీనా సోదరి రెహానా యూకె పౌరసత్వం ఉంది. ఆమె కూతురు తులిప్ సిద్ధిఖీ ప్రస్తుతం యూకేలో అధికార లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలు. ఈ క్రమంలో హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్టు సమాచారం.

మరోవైపు బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది. అల్లర్ల కారణంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని కోరింది. ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అభిప్రాయపడింది.

మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ ఆదేశ టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడారు. హసీనా రాజీనామా చేశారని, తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుందన్నారు. ప్రస్తుతం అన్ని బాధ్యతలను ఆర్మీ తీసుకుందని, దయచేసి సహకరించాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.

Related News

Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరిన తొలి కంపెనీగా రికార్డు

Dhaka plot to kill Modi: మోదీపై అమెరికా భారీ కుట్ర.. చివరి నిమిషంలో హెచ్చరించిన పుతిన్?

Amazon layoffs: అమెజాన్‌లో ఉద్యోగాల కోత.. 30 వేల మందిపై వేటు? మేనేజర్లకు ఈ-మెయిల్స్

Explosion in America: అమెరికాలో భారీ పేలుడు..16 మంది దుర్మరణం

Diwali Celebrations Canada: కెనడాలో దీపావళి వేడుకలు.. 2 ఇళ్లను తగలబెట్టేసిన భారతీయులు!

Mahnoor Omer: పీరియడ్ ట్యాక్స్‌పై.. పాక్ ప్రభుత్వానికి రోడ్డుకీడ్చిన యువతి, ఈమె ధైర్యానికి సలాం!

Happiest Countries 2025: ఈ ఏడాది హ్యాపీయెస్ట్ కంట్రీస్ లిస్ట్ వచ్చేసింది, ఆ దేశానికి మళ్లీ ఫస్ట్ ర్యాంక్!

KG Tomatoes Rs 600: కిలో టమాటాలు రూ.600.. అల్లం రూ.750.. ఉల్లి రూ.120, ఎక్కడో తెలుసా?

Big Stories

×