E-Paper
Advertisement

Fighter jets Escort Air India: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో హై టెన్షన్

Fighter jets Escort Air India: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో హై టెన్షన్
Advertisement

Fighter jets Escort Air India| విమానం గాల్లో ఉండగా.. బాంబు పేలుడు జరుగుతుందని ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో విమానం ల్యాండింగ్ సమయంలో భద్రత కోసం మిలిటీర జెట్ ఫైటర్ విమానాలు ప్యాసింజర్ విమానాన్ని జనవాసాలకు దూరంగా సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాయి. ఈ ఘటన ఎయిర్ విమానానికి సింగపూర్ దేశంలో జరిగింది.

మంగళవారం రాత్రి మధురై నగరం నుంచి సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం AXB 684 లో బాంబు ఉందని ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. అప్పటికే విమానం సింగపూర్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో ఉంది. ఈ సమాచారం సింగపూర్ ప్రభుత్వానికి చేరడంతో అక్కడి ప్రభుత్వం తమ రక్షణ బలగాలకు రంగంలోకి దింపింది. సింగపూర్ ఫైటర్ జెట్ విమానాలతో గాల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని చుట్టముట్టి సింగపూర్ లోని చాంగి ఎయిర్ పోర్ట్ లోని నిర్మానుష ప్రాంతంలో దింపాయి.

Advertisement

విమానం ల్యాండ్ కాగానే ఎయిర్ పోర్ట్ లోని గ్రౌండ్ బేస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, బాంబు నిర్వీర్యం చేసే ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్‌పోజల్ టీమ్స్ చేరుకున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ఎయిర్ పోర్ట్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Also Read:  బేరుట్‌లో కూలిపోయిన ఇళ్లు.. బాంబుల భయంతో రోడ్లపై నిద్రిస్తున్న వేలాది ప్రజలు..

Advertisement

ఈ విషయం గురించి సింగపూర్ రక్షణ శాఖ మంత్రి ఎన్‌జి ఎంగ్ హెన్ ట్విట్టర్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. రాత్రి దాదాపు 10 గంటలకు తమకు విమానంలో బాంబు ఉందని సమాచారం అందిందని.. అయితే తమ ఫైటర్ జెట్స్ సురక్షితంగా విమానాన్ని చాంగి ఎయిర్ పోర్ట్ లోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారని ఆయన ట్వీట్ లో తెలిపారు.

విమానంలో బాంబుని నిర్వీర్యం చేసేందకు రక్షణ బృందాలు చర్యలు చేపట్టారని వెల్లడించారు. విమానం ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు తన పోస్ట్ లో తెలియాజేశారు. మరోవైపు ఎయిర్ ఇండియా తరపు నుంచి విమానంలో ఎంత మంది ప్రయాణీకులు ఉన్నారో సమాచారం అందలేదు. బాంబు బెదరింపుల గురించి ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు.

మంగళవారం ట్విట్టర్ ఎక్స్ లో ఒక పోస్ట్ ప్రకారం.. మొత్తం ఏడు ఇండియన్ విమానాలలో బాంబు ఉంది. ఈ క్రమంలోనే న్యూ ఢిల్లీ నుంచి చికాగో వెళుతున్న విమానాన్ని కెనడాలోని ఇకాలుయిత్ ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ముంబై నుంచి న్యూ యార్క్ బయలుదేరిన విమానం కూడా బాంబు బెదిరింపు కారణంగా న్యూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది.

చికాగో, న్యూ యార్క్ లాంటి అమెరికా నగరాలకు వెళ్లే విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో మంగళవారం అమెరికా ప్రభుత్వం దీనిపై స్పందించింది. ”కమర్షియల్ ఏవియేషన్ (ప్యాసింజర్ విమానాలు)కు ఎటువంటి బెదిరింపులు వచ్చినా బాధ్యులపై కఠినంగా చర్యలు చేపడతాం. సంబంధిత విచారణ ఏజెన్సీలు ఈ సమస్యపై వెంటనే స్పందించాలి. బెదిరింపులు నిజం అయినా కాకపోయినా.. విమాన సంస్థలు వీటని సీరియస్ గా తీసుకోవాలి.” అని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియా సమావేశంలో అన్నారు.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×