BigTV English
Advertisement

London: నిరసనలతో దద్దరిల్లిన లండన్‌.. లక్షమంది హాజరు, అదే ప్రధాన ఎజెండా?

London: నిరసనలతో దద్దరిల్లిన లండన్‌.. లక్షమంది హాజరు, అదే ప్రధాన ఎజెండా?

London: వలసలకు వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లింది లండన్‌ సిటీ. యాంటీ-ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్‌సన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి లక్ష కుపైగా నిరసనకారులు పాల్గొన్నారు. యూకేలో జరిగిన అతిపెద్ద నిరసనల్లో ఇది కూడా ఒకటి. బ్రిటన్ రాజకీయాల్లో ఈ అంశం ప్రధానంగా మారింది.


అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు పెద్ద సమస్యగా మారింది. వీటి కారణంగా లక్షలాది మంది ప్రతీ ఏడాది ఆయా దేశాలకు వలస పోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు ఇదొక సమస్యగా మారింది. కేవలం అమెరికా మాత్రమే కాదు. ఈ సెగ యూకేని సైతం తాకింది. లేటెస్ట్‌గా లండన్‌ సిటీలో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్‌ ర్యాలీ జరిగింది.

దీనికి యూకెలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు లక్ష నుంచి లక్షన్నరకు పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ విషయాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు స్వయంగా వెల్లడించారు.  ప్రజలు  నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ స్థాయిలో ప్రజలు హాజరుకావడానికి కారణాలు చాలానే ఉన్నాయి.


ఐరోపాలో దాదాపు 44 దేశాలు ఉన్నాయి. అందులో 27 దేశాలు యూరోపియన్ యూనియన్‌గా కూటమి ఏర్పడింది. ఈయూ ద్వారా ఆయా సభ్య దేశాలు సార్వభౌమాధికారాన్ని పంచుకుంటాయి. కూటమిలో జర్మనీదే ఆధిపత్యం. కాకపోతే ఆయా దేశాలతోపాటు ఆసియా దేశాల ప్రజలు యూకెకు వలసలు పెరిగాయి.  ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్ పేరుతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతోంది.

ALSO READ: జపాన్‌లో వందేళ్లకు పైబడినవారు లక్షకు చేరువలో

దీనివల్ల యూకెకి వలసలు బాగా తగ్గాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 28 వేల మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. వలసలు రికార్డు స్థాయికి చేరడంపై స్థానిక జనాభాలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. వలసదారుల వల్ల స్థానికుల ఉద్యోగాలను పోతున్నాయని నిరసనకారుల మాట.

అక్రమ వలసలు యూకెకు పెను భారంగా మారారని యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా దేశాల నుంచి యూకెకి వలసలు పెరగడంతో యాంటీ-ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్‌సన్ ఆధ్వర్యంలో భారీగా నిరసన ర్యాలీ జరిగింది. బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన అంశం కీలకంగా మారింది.

రాబిన్‌సన్ ఈ అంశాన్ని మరింతగా పెద్దది చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లండన్‌లో జరిగిన ర్యాలీలో నిరసనకారులు అమెరికా టోపీలు, ఇజ్రాయెల్ జెండాలు ప్రదర్శించడం కలకలం రేపింది. యాంటి ఇమిగ్రేషన్ నిరసనకారులు యూనియన్ ఫ్లాగ్, సెంట్ జార్జ్ క్రాస్ జెండాలను ప్రదర్శించారు. లండన్ బాటలో స్వీడన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీలో మరో అంశం చోటు చేసుకుంది. ఈ ర్యాలీ సమయంలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ పేరుతో మరో నిరసన జరిగింది. ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 25 మంది వరకు పోలీసు అధికారులు గాయపడినట్టు బ్రిటన్ పత్రికలు చెబుతున్నాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. మొత్తానికి లండన్‌లో జరిగిన ర్యాలీని వలసలు పెరుగుతున్న దేశాలు ఇదే పంథాని అనుసరించాలని భావిస్తున్నాయట.

 

 

Related News

ISIS terrorist confess: పాక్ బట్టలిప్పిన టెర్రరిస్ట్.. ఐసీస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారంటూ వాంగ్మూలం

Helicopter Crash: ఘోర ప్రమాదం.. కుప్ప కూలిన హెలికాఫ్టర్‌.. సోషల్ మీడియాల్ వీడియోలు వైరల్

US Nuclear Weapons: 33 ఏళ్ల తర్వాత అణ్వాయుధాలను బయటకు తీస్తున్న ట్రంప్ మామ.. ఎందుకంటే?

Trump Xi Jinping Meeting: జిన్ పింగ్ తో డొనాల్డ్ ట్రంప్ భేటీ.. టారిఫ్ లపై చైనాకు భారీ ఊరట

Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరిన తొలి కంపెనీగా రికార్డు

Dhaka plot to kill Modi: మోదీపై అమెరికా భారీ కుట్ర.. చివరి నిమిషంలో హెచ్చరించిన పుతిన్?

Amazon layoffs: అమెజాన్‌లో ఉద్యోగాల కోత.. 30 వేల మందిపై వేటు? మేనేజర్లకు ఈ-మెయిల్స్

Explosion in America: అమెరికాలో భారీ పేలుడు..16 మంది దుర్మరణం

Big Stories

×