BigTV English

US Elections Trump: భారత్ తరహాలో అమెరికా ఎన్నికలు.. ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్

US Elections Trump: భారత్ తరహాలో అమెరికా ఎన్నికలు.. ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్

US Elections Trump| అగ్రరాజ్యం అధ్యక్షుడిగా పదవి చేపట్టి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా వ్యవస్థ ప్రక్షాళన లక్ష్యంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు (ఓటర్ ఐడి ప్రూఫ్) చూపడం తప్పనిసరి చేస్తూ.. ట్రంప్ మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇండియా, బ్రెజిల్ వంటి దేశాలను ఉదాహరణగా చూపించి అక్కడ ఈ ప్రక్రియలో ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.


‘‘స్వయంకృషి ఆధారంగా మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉన్నప్పటికీ, ఆధునిక, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఎన్నికల ప్రక్రియలో అనుసరిస్తున్న ప్రాథమిక నిబంధనలను మనం అమలు చేయడంలో విఫలమయ్యాం. ఉదాహరణకు.. భారత్, బ్రెజిల్‌ వంటి దేశాలు ఓటర్ల గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్‌తో అనుసంధానిస్తున్నాయి. కానీ, మనం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతున్నాం. అలాగే, జర్మనీ, కెనడా వంటి దేశాలు పేపర్ బ్యాలెట్ల పద్ధతిని అనుసరిస్తున్నా.. మన ఎన్నికల ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయి’’ అని ట్రంప్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

Also Read:  అమెరికా యుద్ధ ప్రణాళికలు మీడియాకు లీక్.. ట్రంప్ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం


ఇకపై ఓటర్లు తమ అమెరికా పౌరసత్వాన్ని రుజువుగా చూపించాల్సి ఉంటుంది. అంటే, ఓటర్లు తమ యూఎస్ పాస్‌పోర్ట్ లేదా జనన ధ్రువీకరణ పత్రాన్ని చూపించి తమ పౌరసత్వం నిర్ధారించాలి. అదేవిధంగా.. ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు మాత్రమే విరాళాలు ఇవ్వాలని, మరింత కఠిన నిబంధనలు తీసుకురావాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ కొత్త నియమాలు ప్రకారం.. మెయిల్‌ ద్వారా వచ్చిన ఓట్లను ఎన్నికల రోజు నాటికి మాత్రమే లెక్కించాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల రోజు తర్వాత వచ్చిన ఓట్లను కూడా అంగీకరిస్తున్నారు.

ఇందుకు సంబంధించి ట్రంప్ గతంలో మాట్లాడుతూ.. ‘‘మోసాలు లేకుండా, సూటిగా, న్యాయపరమైన ఎన్నికలు నిర్వహించడం మన బాధ్యత. నిజమైన విజేతను నిర్ణయించడానికి ఈ మార్పులు అత్యంత అవసరం’’ అని పేర్కొన్నారు. 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ ఎన్నికల విధానంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

ట్రంప్ ఎన్నికల నిర్ణయంపై రిపబ్లికన్ చట్టసభ సభ్యులు మద్దతు తెలిపారు. ఇది ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుందని వారు అభిప్రాయపడారు. జార్జియా విదేశాంగ కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్ ఈ ఉత్తర్వు ద్వారా అమెరికా పౌరులు మాత్రమే దేశంలో జరిగే ఎన్నికల ఫలితాలను నిర్ణయించేందుకు అవకాశం ఇస్తుందని తెలిపారు. మరోవైపు డెమొక్రాట్లు ఈ ఉత్తర్వులను వ్యతిరేకించారు. వారు ఈ మార్పు వల్ల కొంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని పేర్కొన్నారు. 2023లో జరిగే నివేదిక ప్రకారం.. అర్హత కలిగిన అమెరికా పౌరులలో తొమ్మిది శాతం మందికి పౌరసత్వ రుజువు లేదని వెల్లడించారు.

మరోవైపు 18 రాష్ట్రాలలో.. ఎన్నికల రోజు తర్వాత వచ్చిన మెయిల్‌ ఓట్లను అంగీకరిస్తున్నాయి. ట్రంప్ ఈ విధానాన్ని ఇకపై రద్దు చేయాలని నిర్ణయించారు. కొలరాడో డెమోక్రటిక్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెనా గ్రిస్వోల్డ్ ఈ ఉత్తర్వును చట్టవిరుద్ధమైనదిగా అభివర్ణిస్తూ.. ఇది ఓటర్ల సంఖ్యను తగ్గించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×