Budget on Congress: ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ స్పందించింది. ఈ బడ్జెట్ ద్వారా ఎవరికి ఉపయోగమని కాంగ్రెస్ ప్రశ్నించింది. నాలుగు కీలక రంగాలను అభివృద్ధికి శక్తి ఇంజిన్లుగా పేర్కొనడంపై విమర్శలు గుప్పించింది. బడ్జెట్ రైలుకు అనేక ఇంజిన్లు ఉన్నాయని.. ఇది కాస్త పట్టాలు తప్పిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.
బడ్జెట్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా స్పందించారు. ‘ఆర్థిక మంత్రి నాలుగు కీలక రంగాల గురించి మాత్రమే మాట్లాడారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు అనే నాలుగు ఇంజిన్ల గురించే మాత్రమే బడ్జెట్లో ఆమె ప్రసంగించారు. కానీ చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పింది. త్వరలో బిహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వారి స్వార్థం కోసమే మాత్రమే ఆ రాష్ట్రంలో వరాలను కురిపించింది’ అని జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇంటర్నేషనల్ కంపెనీలు కోరుకున్న 2010 నాటి న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ను బీజేపీ నేత అరుణ జైట్లీ సూచన మేరకు దెబ్బతీసిందని జైరాం రమేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ను బుజ్జగించేందుకు.. తాజాగా చట్టాన్ని సవరించినట్లు ప్రకటించారని జైరాం రమేష్ కీలక ఆరోపణలు చేశారు