Rain Alert: తెలంగాణలో భానుడి భగభగలకు ఎట్టకేలకు బ్రేక్ పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడటంతో పాటు రాబోయే రెండు గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుత ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, అలాగే సంగారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఈదురుగాలులు కూడా వీడవచ్చు.
ఇక మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మరిన్ని మార్పులు రానున్నాయి. ఉత్తర , మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలుముకుని, మరికొన్ని చోట్ల వర్షాలు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగించనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Also Read: యాదాద్రి జిల్లాలో విషాదం.. గేట్ టుగెదర్ పార్టీలో టెక్కీ అనుమానస్పద మృతి!