BigTV English

Kishmish: కిస్ మిస్‌లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే !

Kishmish: కిస్ మిస్‌లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే !

Kishmish: ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిలోని పోషకాలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ప్రజలు ఎక్కువగా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షను తింటారు. వీటిని తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.


పాలలో ఎండు ద్రాక్షను నానబెట్టి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా. ఇలా చేయడం వల్ల ఎండు ద్రాక్షల్లోని పోషకాలు రెట్టింపు అవుతాయి. ఎండు ద్రాక్షలను పాలల్లో నానబెట్టి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముకలను బలపరుస్తాయి:


పాలలో నానబెట్టి ఎండు ద్రాక్ష తినడం వల్ల కాల్షియం, ఐరన్ మరియు విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలను అందుతాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇలా తినడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఎముకలు బలంగా మారతాయి. ముఖ్యంగా కీళ్లనొప్పులు లేదా ఇతర ఎముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.

ఒత్తిడి మానసిక అలసట నుండి ఉపశమనం:

ట్రిప్టోఫాన్ పాలలో ఉంటుంది. ఇది మెదడులో సెరోటోనిన్ (ఆనందాన్ని కలిగించే హార్మోన్) స్థాయిని పెంచుతుంది. తద్వారా ఒత్తిడితో పాటు ఆందోళనను తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. ఎండుద్రాక్ పాలలో నానబెట్టి తినడం వల్ల ఒత్తిడి , మానసిక అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణ సమస్యలకు మేలు చేస్తుంది:
ఎండుద్రాక్షలో ఫైబర్ , పాలలో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి పేగులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు మలబద్ధకం, గ్యాస్ లేదా ఆమ్లత్వం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.

రక్తహీనతను తొలగిస్తాయి:
ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త లోపాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో పాటు ఎండుద్రాక్షను పాలతో కలిపి తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. అంతే కాకుండా అలసటను తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష, పాల కలయిక రక్తహీనతతో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read: పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

రక్తపోటు తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది:
ఎండుద్రాక్షలో పొటాషియం , ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పాలలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోయి రక్తపోటు సాధారణంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Related News

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Alcohol: 30 రోజులు ఆల్కహాల్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Masala Vada: మాసాలా వడ బయట తిన్నట్లే క్రిస్పీగా రావాలంటే.. ఇలా ట్రై చేయండి

Brain Health:ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది

High Cholesterol: గుండె జబ్బులు రాకూడదంటే ? నిపుణుల సూచనలివే !

Warning Signs of Stroke: బ్రెయిన్ స్ట్రోక్.. ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి ?

Big Stories

×