BigTV English
Advertisement

Health Tips: రాత్రి 7 గంటలలోపు భోజనం చేస్తే.. మీ ఆయుర్దాయం ఎంత పెరుగుతుందో తెలుసా ?

Health Tips: రాత్రి 7 గంటలలోపు భోజనం చేస్తే.. మీ ఆయుర్దాయం ఎంత పెరుగుతుందో తెలుసా ?

Health Tips: రుచి కరమైన పోషకాహారం తినడానికి, వండటానికి సమయాన్ని కేటాయించడం ప్రస్తుతం సవాలుగా మారింది. సమయానికి భోజనం చేయకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సరైన సమయంలో ఆరోగ్యకరమైన భోజనం తినడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి , అనారోగ్యాన్ని నివారించడానికి చాలా ముఖ్యం.


రాత్రి 7 గంటలకు ముందే డిన్నర్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మాత్రమే శరీరం నిద్రపోయే ముందు తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తుంది. మీరు ప్రతిరోజూ రాత్రి 7 గంటల ముందు భోజనం చేయడం ఎందుకు అలవాటు చేసుకోవాలి ? ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:


బరువు తగ్గడం:
రాత్రి 7 గంటల లోపు భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంతే కాకుండా త్వరగా భోజనం చేయడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఆకలి కూడా తగ్గుతుంది. జంక్ ఫుడ్ ను స్నాక్ గా తీసుకోకుండా నిరోధిస్తుంది.

మలబద్ధకాన్ని నివారిస్తుంది:
మలబద్ధకం అనేది చాలా మంది ఎదుర్కొనే పేగు సమస్య. ఇది బాధాకరమైన జీర్ణ సంబంధిత సమస్య అని చెప్పొచ్చు. రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల శరీరానికి ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి తగినంత సమయం ఇవ్వడం ద్వారా మలబద్ధకం, ఉబ్బరం , అజీర్ణం వచ్చే అవకాశం తగ్గుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు రాత్రి 7 లోపు భోజనం చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
డయాబెటిస్ అనేది శరీరం తాను తయారు చేసుకునే ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేని లేదా తగినంతగా ఉత్పత్తి చేయని స్థితి. రాత్రి భోజనం ముందుగా తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతే కాకుండా శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన గుండె:
నిద్రలేవగానే మన రక్తపోటు పెరగడం మొదలవుతుంది కాబట్టి, పడుకునే ముందు రెండు లేదా మూడు గంటల ముందు రాత్రి భోజనం చేయడం మంచి అలవాటు. మరోవైపు మనం నిద్రపోతున్నప్పుడు మన రక్తపోటు తగ్గడం ప్రారంభమవుతుంది. శరీరంలో ఈ ప్రక్రియ ప్రతి రోజూ కొనసాగుతుంది. కానీ రాత్రి ఆలస్యంగా తినడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరగదు. త రక్తంలో చక్కెర స్థాయిలు ఏర్పడతాయి.

Also Read: రోజ్ టీ ఎప్పుడైనా తాగారా ? ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు !

మెరుగైన నిద్ర:
రాత్రి 7 గంటల లోపు భోజనం చేసినప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకోవడానికి , పోషకాలను తిరిగి నింపు కోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చివరి భోజనం పడుకునే ముందు రెండు నుండి మూడు గంటలకు ముందే తినాలి. ఇలా చేయడం వల్ల మాత్రమే శరీరం ఆహారాన్ని మరింత సమర్థవంతంగా జీర్ణం చేసుకోగలదు. ఈ కాలంలో విశ్రాంతి తీసుకోవడానికి , వేగాన్ని తగ్గించడానికి తగినంత సమయం ఉంటుంది. రాత్రి 7 గంటల లోపు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని 35% ఆయుర్ధాయం పెరుగుతుందని చెబుతుంటారు.

Related News

Pomegranates: వీళ్లు.. దానిమ్మ అస్సలు తినకూడదు తెలుసా ?

Rava Pulihora: ఒక్కసారి రవ్వ పులిహోర ఇలా చేసి చూడండి, వదలకుండా తినేస్తారు

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Big Stories

×