E-Paper
Advertisement

Sankranti: సంక్రాంతినాడు పూజించాల్సింది ఈ దేవుడినే, ఆ రోజు ఇవే తినాలి

Sankranti: సంక్రాంతినాడు పూజించాల్సింది ఈ దేవుడినే, ఆ రోజు ఇవే తినాలి

సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లోని అతి పెద్ద పండుగల్లో ఒకటి. జనవరి వచ్చిందంటే నగరాలన్నీ మూడు రోజులు పాటు ఖాళీ అయిపోతాయి. ప్రజలంతా గ్రామాలకు తరలి వెళ్తారు. గ్రామాలు, బంధుమిత్రులతో రంగవల్లికలతో గాలిపటాలతో కళకళలాడుతూ ఉంటాయి. అందరికీ సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టం కానీ సంక్రాంతి నాడు ఏ దేవుడిని పూజించాలో మాత్రం తక్కువ మందికే తెలుసు.

సంక్రాంతి రైతుల పండుగ. రైతుల చేతికి పంట వచ్చిన సందర్భంగా ఆర్భాటంగా చేసే వేడుక. కాలచక్రానికి అధిపతి అయిన సూర్యుడు సంక్రాంతి నాడు పూజలు అందుకుంటాడు. కాలచక్రం సూర్యుడే ఆధీనంలోనే ఉంటుంది. దక్షిణాయనంలో ఉన్న సూర్యుడు సంక్రాంతి రోజే ఉత్తరాయణంలోకి వెళతాడు. ఇది పుణ్యకాలం. ఇదే సమయానికి పంట కూడా చేతికి వచ్చేస్తుంది. అందుకే సంక్రాంతినాడు సూర్యరాధన ఎంతో ముఖ్యం. సూర్యుణ్ణి ఆరాధించడమే కాదు వర్షాలు కురిపించిన ఇంద్రుడిని, పంటను ఇచ్చిన నేల తల్లిని కూడా పూజించాలి. అందుకే నేలపై అందమైన రంగవల్లికలు వేసి గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమల జల్లి పూజలా చేస్తారు.

సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి.ఆ రోజే కొత్త బియ్యంతో బెల్లం, ఆవు పాలు కలిపి పొంగలి వండుతారు. ఆ పొంగలినే సూర్య భగవానుడికి నివేదిస్తారు. భోగి రోజు సాయంత్రమే సూర్యాస్తమయానికి ముందు ఇంట్లోని చిన్నపిల్లలకు భోగి పండ్లను పోసి ఆశీర్వదిస్తారు. భోగి పండ్లు అంటే చలికాలంలోనే దొరికే రేగు పండ్లు. సంస్కృతంలో దీన్ని బదరీ ఫలము అని పిలుస్తారు. రేగుపండు ఎంతో ప్రత్యేకమైనది. పిల్లలపై ఈ రేగు పండ్లను పోయడం ద్వారా సూర్యుడి శక్తి వారిలోకి చేరుతుందని నమ్ముతారు. రేగుపండుకు సూర్యుడు కాంతిని తనలో నింపుకునే శక్తి ఉందని చెప్పుకుంటారు.

భోగి పండుగ మర్నాడు అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి ఈరోజే. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే మకర సంక్రాంతిగా మారింది. అంటే ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమైనట్టే. ఈ ఒక్కరోజు మీరు చేసే దానధర్మాలు ఏడాదంతా ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు మీరు గుమ్మడికాయ దానం చేస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారట. అలాగే నువ్వులను తినడం వల్ల ఏడాదంతా ఆరోగ్యము, ఆయుష్షు కూడా కలుగుతుంది. తెల్ల నువ్వులతో చేసిన స్వీట్లను కచ్చితంగా మకర సంక్రాంతి రోజు తినేందుకు ప్రయత్నించండి.

సంక్రాంతి రోజు ఇంట్లోని పశువులను కూడా ఆరాధించాలి. ఇప్పుడు అనేక రకాల ఉద్యోగాలు వచ్చాయి, కానీ మన పూర్వీకులకు పశువులే ఆధారం. వాటివల్లే పంటలు పండుతాయియి. వాటి సాయంతోని పాలు పెరుగు వంటివి మనము తినగలిగాము. కాబట్టి పశువులను ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కనుమనాడు పశువుల పూజ చేయాలి. పశువులశాలను శుభ్రం చేసి గోవుల్ని స్నానం చేయించి పసుపు కుంకుమ పెట్టి పూలమాలతో అలంకరించి వాటికి మేత వేయాలి. అవి మిమ్మల్ని దీవిస్తాయి. ఈ విధంగా సంక్రాంతి పండుగను పూర్తి చేస్తే మీకు ఏడాదంతా ఎంతో మేలు జరుగుతుంది. పితృదేవతలు సంతోషిస్తారు.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×