AIswarya Rajesh : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్ టు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె హీరోయిన్గా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. గత ఏడాది వచ్చినా సంక్రాంతికి వస్తున్న మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న కూడా ఆ సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందేవ్వలేదని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలు ప్రేక్షకులను అలరించిన కూడా బిగ్గెస్ట్ హిట్టుగా నిలవలేదు. మొన్నటి వరకు స్టార్ హీరోలకు ఆప్షన్ గా ఉన్న ఐశ్వర్య రాజేష్ కు పోటీగా నయనతార రావడంతో ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సులు రావడంలేదని అర్థం అవుతుంది. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు మాత్రం సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా అంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. మొన్నటి వరకు చీర కట్టలు కనిపించిన ఈమె ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచడంతోపాటుగా గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పదహారు అణాల తెలుగమ్మాయిలాగా పద్ధతిగా కనిపిస్తుంది.. ఈమధ్య ట్రైనింగ్ డ్రెస్ లతో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలావరకు పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు ఈ మధ్య గ్లామర్ పాత్రలకి ప్రాధాన్యత ఇచ్చేలా ఫోటోషూట్లు చేస్తుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమాల కోసం తన పద్ధతిని మార్చుకుందేమో అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కూడా మోడరన్ లుక్లో ఐశ్వర్య రాజేష్ అదిరిపోయింది అని మరి కొంతమంది కామెంట్స్ తో తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టైలిష్ గా కనిపిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫోటోలు ఎంత బాగున్నాయో మీరు ఇటు ఓ లుక్కేసుకోండి.
ఐశ్వర్య రాజేష్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అప్పటినుంచి ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె ఈ ఏడాది సినిమాలలో నటించింది.. ఓ సుకుమారి, ఇసకపట్నం వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే టాక్ మీ సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు మరో రెండు సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం.. అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఆ చిత్రాలు త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయని కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. తెలుగులో కూడా ఓ భారీ ప్రాజెక్టులో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా కూడా భాగ్యం బాగా బిజీగా మారింది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు..
Also Read :కార్తీక దీపం విలన్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?