Revanth Govt: తెలంగాణలోని మధ్య-పేద తరగతి కుటుంబాలకు తీపి కబురు చెప్పింది రేవంత్ ప్రభుత్వం. కొత్తగా లక్ష రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతోంది. ఆగష్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంగా అధికారికంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్రెడ్డి. ఆ తర్వాత అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏక కాలంలో పంపిణీ జరగనుంది.
ఆగస్టు 15 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా లక్షకు పైగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుకానుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డిలో ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఆ రోజు నుంచి 119 నియోజకవర్గాలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది.
ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు సమక్షంలో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ విడతలో సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు లామినేటెడ్ రూపంలో రెడీ చేసిన నూతన రేషన్ కార్డులను ఇవ్వనున్నారు.
వాటర్ప్రూఫ్, క్రెడిట్ కార్డు తరహాలో ఆకర్షణీయంగా ఉండేలా ఈ స్మార్ట్ కార్డులు రూపకల్పన చేశారు. కార్డుపై క్యూఆర్ కోడ్తోపాటు ఆధునిక భద్రతా ప్రమాణాలను పొందుపరిచినట్టు సమాచారం. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందేలా లబ్ధిదారుల జాబితాను పూర్తి చేయాలన్నారు.
ALSO READ: 8 నెలల బేబీ కిడ్నాప్.. మూడు గంటల్లో చేధించిన పోలీసులు, అసలేం జరిగింది?
రేషన్ కార్డుల ముద్రణ మొదలు జిల్లాలకు చేరే వరకు రవాణా నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉంచింది పౌరసరఫరాల శాఖ. పంపిణీలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు జిల్లా కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ఆయా ఆదేశాల్లో పేర్కొన్నారు. పంపిణీ ప్రక్రియ పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందజేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఇప్పటికే సూచించారు సీఎం రేవంత్రెడ్డి.
Telangana Govt to Distribute 1.05 Crore New Ration Cards from August 15
రాష్ట్ర ప్రజలకు తీపికబురు
ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీ
🔹ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డి లో ప్రారంభం
🔹 అదే రోజున 119 నియోజకవర్గాలలో కొత్త… pic.twitter.com/s1RMgQC6Sn
— Congress for Telangana (@Congress4TS) August 6, 2026