Alia Bhatt: అలియా భట్.. మహేష్ బట్ కూతురిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ స్టార్ కిడ్ ప్రస్తుతం చేస్తున్న భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా రాజస్థాన్ లోని JECRC) ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళిన అలియాకు ఒక క్రేజీ ఇన్సిడెంట్ ఎదురైంది.అయితే ఏమాత్రం తడబడకుండా ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా పాపులర్ డైలాగుతో ఆమె ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అసలు విషయానికి వస్తే.. యూనివర్సిటీ స్టూడెంట్స్ తో అలియా భట్ మాట్లాడుతున్న సమయంలో ఒక స్టూడెంట్ ఆమెకి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేశాడు.
ఎలాంటి ఫిల్టర్ లేకుండా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఓటీటీ షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ కి వెళ్లడానికి మీ మేనేజ్మెంట్ మరియు మీరు ఎలా ఒప్పుకున్నారని అడిగాడు.దానికి అలియా సమాధానమిచ్చేలోపే అక్కడ కూర్చున్న ఒక స్టూడెంట్ పైసా అంటూ గట్టిగా అరిచాడు .అంటే ఆ షో కి అలియా కేవలం డబ్బుల కోసమే అటెండ్ అయిందని అర్థం వచ్చేలా స్టూడెంట్ సెటైర్ వేశాడు.
దీంతో ఈ కామెంట్ కి ఏ మాత్రం కంగారు పడకుండా వెంటనే మైకు అందుకొని ఇంతకీ ఆ మాట అన్నది ఎవరు బహుశా ఒక పేదవాడు అనుకుంటా అంటూ సాలిడ్ కౌంటర్ వేసింది .దీంతో ఈ పంచ్ డైలాగ్ అలియా నోటి నుండి రాగానే అక్కడున్న స్టూడెంట్స్ ఒక్కసారిగా షాక్ అవుతూనే ఎంజాయ్ చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ కావడంతో ఇండియా గాడ్ లేటెస్ట్ అఫీషియల్ అకౌంట్ సైతం టూ గుడ్ అని మెచ్చుకోగా, సమయ్ రైనా సైతం యూ కిల్డ్ ఇట్ అంటూ అలియాస్ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు.
అలియా భట్ పైసా అనడం వెనుక ఒక క్రేజీ ఇన్సిడెంట్ ఉంది.సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కి అలియాభట్, ఆమె కోస్టార్ శార్వరి వాగ్ గెస్ట్లుగా వెళ్లారు.అక్కడ షో హోస్ట్ సమయ్ రైనా ఒక కంటెస్టెంట్ ని మగవారిలో అమ్మాయిలకు అన్నింటికన్నా ఎక్కువ నచ్చేది ఏంటి అని అడిగినప్పుడు ఆడియన్స్ నుంచి ఒకతను మహిళలను కించపరిచేలా పైసా అని అరిచాడు . దానికి సమీర అయినా కౌంటర్ గా కచ్చితంగా ఎవరో ఒక పేదవాడే ఆ మాట అని ఉంటాడు అంటూ సాలిడ్ కౌంటర్ వేశాడు మహిళల గురించి తక్కువ చేసి వ్యక్తికి బుద్ధి చెప్పేట్టుగా ఉన్న ఆ డైలాగ్ ని ఇప్పుడు అలియా అదే స్టైల్ లో రివర్స్ కౌంటర్ గా వాడటం ఎక్కడ విశేషం .ఇక ఆల్ఫా సినిమా విషయానికి వస్తే జూన్ మూడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నసందర్బంగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.
అందులో భాగంగానే యూనివర్సిటీ కి విచ్చేసింది అలియా .ఇక ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రెస్టేజియస్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’, ‘టైగర్ 3’ వంటి వంటి సాలిడ్ హిట్స్ సరసన ఈ సినిమా నిలుస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.శివ్ రావల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శార్వరి వాఘ్, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించగా, గ్రీక్ గాడ్ హృతిక్ కనిపించ నుండడం విశేషం. చూడాలి మరి యూనివర్స్ లోనే తొలిసారిగా వస్తున్న ఈ లేడీ ఓరియంటెడ్ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ళని కొల్లగొడుతుందో !
Also read :నోలన్ మార్క్ విజువల్ వండర్: ‘ది ఒడిస్సీ’ ఫైనల్ ట్రైలర్ అవుట్.