Sanjjanaa Galrani:విజయ్ సీయం సీటు ఎక్కినప్పటి నుండి నటి త్రిష వార్తల్లో నిలుస్తూనే ఉంది.ఇక తాజాగా త్రిష తమిళనాట జరిగిన అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్టార్ హీరోయిన్ త్రిష పాల్గొనడం,పైగా విజయ్ తో అధికారికంగా స్టేజీని పంచుకోవడంపై ముఖ్యమంత్రి విజయ్తో సెల్యూట్లు మార్చుకోవడంపై ఒక పత్రికలో వచ్చిన వార్త వైరల్ అయిన సంగతి తెల్సిందే.ఇక ఈ వార్త పై కొంతమంది విమర్శలు ఎక్కుపెట్టారు కూడా అయితే తాజాగా ఈ విమర్శలకి నటి సంజనా గల్రాని కౌంటర్ వేశారు .
ఒక మహిళను లేదా ఒక రాజకీయ నాయకుడిని వారి వ్యక్తిగత జీవితాల ఆధారంగా టార్గెట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆమె మండిపడ్డారు. విజయ్ సాధిస్తున్న ప్రజాదరణను, ఆయన సిద్ధాంతాలను రాజకీయంగా ఎదుర్కొలేకనే కొందరు ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు.
త్రిష ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అని ,పైగా సెలెబ్రిటీ కూడా అని, ఆమె ఎక్కడ ఉండాలి, ఏ కార్యక్రమంలో పాల్గొనాలనేది ఆమె పర్సనల్ చాయిస్ అని స్పష్టం చేశారు.విజయ్ చేస్తున్న పనుల్లో ఎలాంటి తప్పులు వెతకలేకనే ఇలా చిన్న చిన్న విషయాలని భూతద్దంలో పెట్టి చూస్తున్నారంటూ ఏకి పారేశారు.విజయ్ పని తీరు ఆధారంగా విమర్శలు చేయాలి కాని ఇలా వ్యక్తుల మీద బురద చల్లడం మానుకోవాలని హెచ్చరించారు.
ఫిబ్రవరి 2, 2024న ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని అధికారికంగా ప్రకటించి కొద్ది నెలల్లోనే సీయం సీటు ఎక్కిన విజయ్,తమిళనాడు రాజకీయంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడని,ఆయన్ని సిద్ధాంతపరంగా ఎదుర్కొలేకనే కొందరు విమర్శకులు ఇలా వివాదాలు సృష్టిస్తున్నారని సంజనా గల్రాని ఘాటుగా విమర్శించారు.
నిజానికి సినిమా మరియు రాజకీయాలలో ఇలాంటి వివాదాలు కొత్తేమీ కానప్పటికీ, విజయ్ మరియు త్రిషల కాంబినేషన్ అంటే కోలీవుడ్ లో ఒక స్పెషల్ అనే చెప్పాలి. 2004లో విడుదలైన ‘గిల్లి’ సినిమాతో సరికొత్త రికార్డులను సృష్టించిన ఈ బ్లాక్బస్టర్ జంట, ఆ తర్వాత ‘తిరుపాచి’ (2005), ‘ఆధి’ (2006), ‘కురువి’ (2008) వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అక్టోబర్ 19, 2023న విడుదలైన ‘లియో’ (LEO) చిత్రంతో మళ్లీ ఒకే తెరపై కనిపించి అభిమానులను మెప్పించిన సంగతి తెల్సిందే.
also read :థియేటర్లకు షాక్.. టికెట్ ధరలపై సర్కార్ కొత్త లెక్క!
చూడాలి మరి సంజనా ఇచ్చిన వార్నింగ్ కి నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో !