E-Paper
Advertisement

Vishal: ఆగస్ట్ 29న గుడ్ న్యూస్ చెబుతానంటున్న విశాల్.. పెళ్లి గురించేనా?

Vishal: ఆగస్ట్ 29న గుడ్ న్యూస్ చెబుతానంటున్న విశాల్.. పెళ్లి గురించేనా?
Advertisement

Vishal: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న విశాల్ (Vishal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన తెలుగు నటుడే అయినా కోలీవుడ్ లో భారీ పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు అక్కడి సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ.. మార్కెట్ బాగానే పెంచుకున్నారు. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా వివాహం చేసుకోకపోవడం పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ఎఫైర్ రూమర్స్ పై ఒక్క మాటతో క్లారిటీ..

Advertisement

దీనికి తోడు రెండు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారు. మొదట వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) ను వివాహం చేసుకోవాలనుకున్న విశాల్.. హీరో శరత్ కుమార్ కారణంగానే ఇద్దరు విడిపోయారని సమాచారం. ఆ తర్వాత లక్ష్మీ మీనన్ (Lakshmi Menon), అభినయ (Abhinaya), అనీషా రెడ్డి (Aneesha Reddy), రీమాసేన్(Reemasen )ఇలా చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటికీ స్వయంగా విశాల్ పలుమార్లు స్పందించి, చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అవన్నీ గాలి వార్తలే అంటూ హీరోయిన్ సాయి ధన్సిక (Sai Dhansika) ద్వారా క్లారిటీ ఇచ్చారు విశాల్.

ఆగస్ట్ 29న గుడ్ న్యూస్..

Advertisement

ఇకపోతే గత కొంతకాలంగా ప్రముఖ తమిళ నటి సాయి ధన్సికతో రిలేషన్ లో ఉన్నట్లు విశాల్ కన్ఫామ్ చేశారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ..”తొమ్మిదేళ్లుగా నడిగర్ సంఘం భవనం కోసమే పెళ్లి చేసుకోలేదు. ఈ భవనం పూర్తయిన వెంటనే అందులోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఇక ఈ భవనంలో జరిగే తొలి పెళ్లి కూడా నాదే. ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నాను. అందులో భాగంగానే ఆగస్ట్ 29వ తేదీన మీ అందరికీ గుడ్ న్యూస్ చెబుతాను అంటూ విశాల్ తెలిపారు. ఇక దీన్ని బట్టి చూస్తే విశాల్ ఆగస్ట్ 29న తన పెళ్లికి కొత్త ముహూర్తం ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్నేళ్ల ఎదురీతకు విశాల్ ఒక్క మాటతో క్లారిటీ ఇవ్వబోతున్నారని చెప్పవచ్చు.

హీరో గానే కాదు నిర్మాతగా కూడా సక్సెస్..

ఇకపోతే హీరో విశాల్ ఒకవైపు నటుడిగా పలు చిత్రాలు చేస్తూనే.. మరొకవైపు నిర్మాతగా కూడా భారీ సక్సెస్ అందుకున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో ప్రముఖ హీరో ఆర్య (Arya) తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే స్టంట్ మాస్టర్ రాజు కూడా మరణించగా.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ALSO READ:Rahul Sipligunj: బంపర్ ఆఫర్ కొట్టేసిన రాహుల్ సిప్లిగంజ్.. ఏకంగా కోటి రూపాయలు నజరానా!

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×