Director Nag Ashwin Request to PM Modi: కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ స్లాబ్లను సవరించిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రధాన మంత్రి జీఎస్టీని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఇటీవల జీఎస్టీ స్లాబ్లను సవరించి.. కొత్త జీఎస్టీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ కొత్త రేట్స్ సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ జీఎస్టీలో మార్పులతో మూవీ టికెట్ల రేట్స్, పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్స్పై ప్రభావం చూపాయి.
ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంతో జీఎస్టీ కౌన్సిల్ మాత్రం మూవీ లవర్స్కి శుభవార్త అందించింది. రూ. 100 లోపు ఉన్న సినిమా టికెట్ రేట్లపై జీఎస్టీ శాతాన్ని భారీగా తగ్గించారు. గతంలో వందలోపు ఉన్న టికెట్పై 12 శాతం జీఎస్టీ పడేది. కానీ, ఈ కొత్త సవరణతో వందలోపు ఉన్న టికెట్పై 5 శాతానికి తగ్గించారు. ఈ కొత్త జీఎస్టీతో చిన్న సినిమా నిర్మాతలంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రూ. 100 పైన ఉన్న టికెట్స్ 18 శాతం జీఎస్టీనే వర్థిస్తుంది. ఈ విషయమై తాజాగా కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ రిక్వెస్ట్ చేశారు.
ప్రధానికి నాగ్ అశ్విన్ రిక్వెస్ట్..
జీఎస్టీని తగ్గిస్తున్నట్టు మోదీ చేసిన ట్వీట్పై నాగ్ అశ్విన్ స్పందిస్తూ ఓ రిక్వెస్ట్ పెట్టారు. “కొత్తగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు స్వాగతించదగినవి సర్. కానీ, సినిమా టికెట్లపై ఉన్న 5 శాతం ఉన్న స్లాబ్లను రూ. 250 వరకు ఉన్న టికెట్లకు కూడా వర్తించేలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని థియేటర్లలోనే టికెట్ ధర రూ. 100 ఉంది. కానీ, చాలా వరకు థియేటర్లలో టికెట్ రేట్స్ రూ. 200 పైనే ఉన్నాయి. చిత్ర పరిశ్రమ, థియేటర్ల వృద్ధికి.. అలాగే మధ్య తరగతి ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇది చాలా అవసరం” అంటూ నాగ్ అశ్విన్ తన ట్విట్లో రాసుకొచ్చారు.
Also Read: Malaika Arora: ఆ ఆస్తిని అమ్ముకున్న బాలీవుడ్ బ్యూటీ మలైకా.. లాభం ఎంత వచ్చిందంటే!
ప్రస్తుతం ఆయన ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. ఆయన అభిప్రాయాన్ని, రిక్వెస్ట్ని ఇండస్ట్రీ వర్గాలు, థియేటర్ యాజమాన్యాలు స్వాగతిస్తున్నాయి. నాగ్ అశ్విన్ చెప్పింది సరైనదని, ఈ విషయమైన ప్రధాని ఆలోచిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా కల్కి 2898 ఏడీ సినిమాతో ఒక్కసారిగా అందరి ద్రష్టిని ఆకట్టుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో ఆయన విజన్, పనితనానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. కల్కి కోసం ఏకంగా మూడు లోకాలను సృష్టించిన ఆయన విజన్కి హాలీవుడ్ సైతం ఫిదా అయ్యింది. కల్కి చిత్రంలో నాగ్ అశ్విన్ పనితీరుపై దర్శకదిగ్గజాలు సైతం కొనియాడారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ని జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్పైకి తీసుకురానున్నాడు.
The gst reforms are very welcome sir. It would be great if the 5% slab can be extended to movie tickets upto 250rs atleast… Very few theaters nowadays are at 100rs and for our industry and theatres to grow and keep the middle class audience coming this is very needed sir. 🙏
— Nag Ashwin (@nagashwin7) September 5, 2025