E-Paper
Advertisement

Malayalam Actress: మోహన్‌ లాల్‌పై సీనియర్‌ నటి సంచలన కామెంట్స్‌.. నా భర్త చనిపోతే.. స్వార్థ బుద్ధితో..

Malayalam Actress: మోహన్‌ లాల్‌పై సీనియర్‌ నటి సంచలన కామెంట్స్‌.. నా భర్త చనిపోతే.. స్వార్థ బుద్ధితో..

Actress Shanthi Williams Accused Mohanlal: మలయాళ సూపర్స్టార్మోహన్లాల్గురించి సీనియర్నటి శాంతి సంచలన కామెంట్స్చేశారు. మోహన్లాల్స్వార్థపరుడని, డబ్బు, ఫేం వచ్చాక చాలా మారిపోయాడంటూ ఆమె ఆరోపించింది. నటి శాంతి విలియమ్స్వందకు పైగా సినిమాల్లో చేశారు. అపరిచితుడు సినిమాల్లో హీరో విక్రమ్కి తల్లిగా నటించి తెలుగు ఆడియన్స్కి సుపరిచితమయ్యారు. తమిళ్‌, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. సీరియల్లోనూ ఆమె కీలక పాత్రలు పోషించారు. 12 ఏళ్ల వయసులోని సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఎన్నో హిట్చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. కెరీర్లో బిజీగా ఉన్నప్పుడే మలయాళీ ఇండస్ట్రీలో ప్రముఖ కెమెరామెన్జె. విలియమ్స్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

మోహన్ లాల్ అలాంటి వాడు

మాలీవుడ్ఇండస్ట్రీకి చెందిన ఆమె స్టార్హీరో మోహన్లాల్గురించి పలు షాకింగ్విషయాలు బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారాయి. ప్రస్తుతం సినిమాల్లో సీరియల్లో చిన్న పాత్రలు చేస్తున్న ఆమె తాజాగా మీడియా ఛానల్కు ఇంటర్య్వూ ఇచ్చింది. సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త జె. విలియమ్స్అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తనకు మలయాళం నుంచి ఎలాంటి సపోర్టు లేదని, ఎవరూ కనికరం చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పైగా ఆయన పరిస్థితిని మోహన్లాల్తన స్వార్థానికి వాడుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది.

నా భర్త విలియమ్స్‌ 2005లో చనిపోయారు. ఆయన కెమెరామెన్గా ఉన్న టైంలో మోహన్లాల్తో ఆయన మంచి సన్నిహితం ఉండేది. ఆయన తరచూ మా ఇంటికి వచ్చేవారు. మాతో చాలా నవ్వుతూ చాలా సరదగా ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆయనలో మోహన్లాల్లేడు. అప్పుడు ఆయనతో చిన్న పిల్లాడి మనస్థత్వం, అమాయకత్వం ఉండేవి. కానీ, ఫేం వచ్చాక ఆయనలో స్వార్థం పెరిగింది. అప్పటి మోహన్లాల్కి, ప్రస్తుత మోహన్లాల్కి చాలా తేడా ఉంది. ఇండస్ట్రీలో చాలా మంది కూడా ఇదే అంటుంటారు. మా ఇంట్లో 10 నుంచి 12 అడుగుల కృష్ణుడి విగ్రహం ఉండేది. మా ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు మేం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాం.

Also Read: Deepika Padukone: అయ్యే దీపికా.. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సపోర్ట్… అయినా డ్యామేజ్ జరిగిపోయింది

లక్షల ఖరీదైన విగ్రహం తీసుకుని..

అదే సమయంలో కృష్ణుడి విగ్రహాన్ని మేము మెయింటెన్చేయలేమని దానిని ఆయన మోహన్లాల్కి ఇచ్చారుఅదే సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మా పిల్లలకు సరైన సదుపాయాలు ఇవ్వలేకపోయాం. సమయంలో మా ఇంట్లో ఎయిర్కూలర్కూడా లేదు. మా ఆర్థిక పరిస్థితిని మా ఆయన మోహన్లాల్కి వివరించి.. కృష్ణుడి విగ్రహాన్ని ఆయనకు ఇచ్చారు. లక్షలు ఖరీదైన విగ్రహాన్ని తీసుకుని దానికి బదులుగా ఆయన తన ఆఫీసులోని పాత ఎయిర్కండిషనర్తెచ్చించాడు. అది పది రోజుల్లోనే రిపేర్కు వచ్చింది. దాంతో దానికి అమ్మేస్తే మాకు రూ. 2 వేలు మాత్రమే వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనూ ఆయన తన స్వార్థ బుద్ధి చూపించారు. అంతేకాదు నా భర్త చనిపోయినప్పుడు కూడా మోహన్లాల్రాలేదు. ఇది గుర్తొచ్చిన ప్రతిసారి నాకు చాలా కోపంగా అనిపిస్తుంది. తనకు మేము ఎంతో చేశాం

కానీ, ఆయన మా పట్ల స్వార్థంగా ఉండటం నన్ను చాలా బాధిస్తుందిఅని చెప్పుకొచ్చారుఅనంతరంనా భర్త చనిపోయిన తర్వాత మలయాళీ ఇండస్ట్రీ నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. కానీ తమిళ్పరిశ్రమకు చెందిన చాలా మంది అండగా నిలిచారు. చాలా మంది ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించారు. డైరెక్టర్శంకర్గారు రూ. 25వేలు సాయం చేశారు. ఇంకేవసరం వచ్చినా.. ఫోన్చేయమని చెప్పారు. కానీ, మలయాళీ నుంచి ఒక్కరు కూడా రాలేదు. నేను పుట్టింది కేరళలోనే.. నేను మలయాళీ ఇండస్ట్రీకి చెందినప్పుటికీ.. నన్ను అలా పిలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మా దగ్గర డబ్బున్న సమయంలో ఎందరికో సాయం చేశాం. కానీ, నా భర్త మరణించిన తర్వాత ఇండస్ట్రీలోని ఎవరూ కూడా కనీసం నన్ను పలకరించలేదుఅంటూ నటి శాంతి కన్నీరు పెట్టుకుంది.

Related News

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

Big Stories

×