BigTV English

Ram Gopal Varma: రామ్‌ గోపాల్ వర్మ విచారణ.. సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసిన పోలీసులు

Ram Gopal Varma: రామ్‌ గోపాల్ వర్మ విచారణ.. సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసిన పోలీసులు


RGV Mobile Seized: సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మ నేడు పోలీసుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను కించపరుస్తూ సోషల్మీడియాలో పోస్టులు పెట్టేవారు. ఇక తన వ్యూహం మూవీ రిలీజ్ సమయంలో వారిని అవమానపరిచే విధంగా ఫోటోలు మార్ఫింగ్చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఏపీలోని పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో టీడీపీ పార్టీ నాయకుడు ఆర్జీవీపై ఫిర్యాదు చేయడంలో కేసు నమోదైంది. కొద్ది రోజులుగా కేసు విషయంలో రామ్గోపాల్వర్మ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. కేసులో గతంలో హైకోర్టుకు ఆయన బెయిల్కూడా ఇచ్చింది.

కించపరిచేలా కామెంట్స్


ఇటీవల కేసులో ఒంగోలు పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వగాఆగష్టు 12 విచారణకు హాజరయ్యారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు ఆర్జీవీ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గత విచారణ సమయంలో రామ్గోపాల్వర్మ సెల్ఫోన్తీసుకురాలేదు. నేటి విచారణలో ఆర్జీవీ తన వెంట సెల్ఫోన్ తీసుకువెళ్లడంతో విచారణకు ముందే పోలీసులు ఫోన్ని సీజ్చేశారు. కాసేపి క్రితమే ఆయన విచారణ ముగిసింది.అయితే మొబైల్ఆయనకు తిరిగి ఇచ్చారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే కేసు విషయంలో పోలీసులు ఆర్జీవీ ఫోన్ను పరిశీలించనున్నారు.

రూ. 2 కోట్లపై కూడా విచారణ

గతంలో వైసీపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ కంపెనీ నుంచి ఆర్జీవీ రూ. 2 కోట్లు చెల్లించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది రెండు కోట్ల వ్యవహారంలోనూ పోలీసులు ఆర్జీవీని విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు, పవన్కళ్యాణ్‌, లోకేష్ఫోటోలు మార్ఫింగ్చేయడం వెనక ఉన్న వారిపై కూడా ఆరా తీస్తున్నారుకాగా గతేడాది నంబర్లో 10 మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఆర్జీవీపై మార్ఫింగ్ ఫోటోలపై కేసు నమోదైంది. దీంతో జనవరిలో విచారణకు రావాలని ఆదేశిస్తూ పోలీసుల నోటీసులు ఇచ్చారు. దీంతో ఆర్జీవీ షూటింగ్కారణంగా విచారణకు రాలేనంటూ పలుమార్లు వాయిదా వేశారు. తర్వాత ఫిబ్రవరి 7 ఆయన తొలిసారి విచారణకు హాజరయ్యారు.

తర్వాత అవసరమైనప్పుడు విచారణకు రావాలని పోలీసులు ఆర్జీవీకి సూచించారుఅయితే తనపై ఉన్న ఈకేసులను కొట్టివేయాలను కోరుతూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కేసులో ఆర్జీవీ బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఆర్జీవీ అరెస్ట్చేయడం, విచారించడం చేయొద్దని పోలీసులను ఆదేశించింది. తర్వాత పోలీసుల పిటిషన్మేరకు ఆర్జీవీని విచారించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. క్రమంలో ఒంగోలు పోలీసులు గతనెల ఆర్జీవీకి నోటీసులు ఇవ్వగా.. షూటింగ్కారణంగా హాజరు కాలేకపోయారు. దీంతో ఆగష్టు 12 విచారణకు రావాలని మరోసారి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో నేడి విచారణకు హాజరయ్యారు.

Also Read: Kantara Movie: కాంతార: చాప్టర్‌ 1కి శాపం.. అవరోధాలున్నాయని దేవుడు చెప్పాడు.. ప్రొడ్యూసర్షాకింగ్కామెంట్స్

Related News

Tollywood: హమ్మయ్య టాలీవుడ్ కి మంచి రోజులు.. త్వరలో కమిటీ నియామకం!

Film Industry: ఇండస్ట్రీలో విషాదం…ఎన్టీఆర్ విలన్ భార్య కన్నుమూత!

The Raja saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, ఒక్క ట్వీట్ తో రచ్చ లేపిన మారుతి

Kantara Chapter1 pre release: ఎన్టీఆర్ నాకు హీరో కాదు… బ్రదర్ రిషబ్ ఇంట్రెస్టింగ్ స్పీచ్!

OG Film: ఓజి నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్

Kantara Chapter 1 Pre release: నొప్పితో బాధపడుతున్న ఎన్టీఆర్.. ఎక్కువ మాట్లాడలేనంటూ!

Kantara Chapter 1 Event: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్, ఫ్యాన్స్ లో జోష్ నింపిన ప్రొడ్యూసర్

Kantara Chapter 1 Event : యాంకర్ సుమా పై మరోసారి సీరియస్ అయిపోయిన ఎన్టీఆర్

Big Stories

×