Ma Inti Bangaram: దర్శకురాలు నందినీ రెడ్డి, సమంత కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిజానికి నందినీ రెడ్డి ఈ కథను మొదట సమంత కోసం అనుకోలేదు. టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని మనసులో పెట్టుకుని ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేసుకున్నారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్కు ‘కోడలు’ అనే టైటిల్ను కూడా అనుకున్నారట. నందినీ రెడ్డి చెప్పిన లైన్ సాయి పల్లవికి నచ్చినప్పటికీ, అప్పటికే ఆమె చేతిలో ఉన్న ఇతర సినిమాల వల్ల డేట్స్ కుదరక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
Read also-బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న ఆ కన్నీటి కథ.. స్టేజ్ పైనే ఎమోషనల్ అయిన బాలయ్య !
సాయి పల్లవి బిజీగా ఉండటంతో ఈ స్క్రిప్ట్ కాస్త రూట్ మార్చింది. ప్రముఖ బాలీవుడ్ మేకర్స్ రాజ్ నిడిమోరు (రాజ్ అండ్ డీకే) రంగంలోకి దిగి ఈ కథలో కొన్ని కీలక మార్పులు చేశారు. సాయి పల్లవి కోసం అనుకున్న కథలోని సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామాకు, సమంత ఇమేజ్ మరియు బాడీ లాంగ్వేజ్కు సరిపోయేలా కొద్దిగా యాక్షన్ ఎలిమెంట్స్ను జోడించి స్క్రిప్ట్ను మరింత పవర్ఫుల్గా రీవర్క్ చేశారు. అలా ‘కోడలు’ కాస్తా సమంత మార్క్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపాంతరం చెందింది.
Read also-నెట్ఫ్లిక్స్ లో ఉన్న హై-వోల్టేజ్ ఎరోటిక్ థ్రిల్లర్స్… ఒంటరిగా చూడాలి మావా
సమంతకు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి వెబ్ సిరీస్ల తర్వాత యాక్షన్ ఓరియెంటెడ్ కథలు బాగా సూట్ అవుతుండటంతో, ఈ కొత్త వెర్షన్ ఆమెకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని మేకర్స్ భావించారు. అలా సాయి పల్లవి రిజెక్ట్ చేసిన ఈ కథ.. చివరికి ‘మా ఇంటి బంగారం’ టైటిల్తో సమంత లీడ్ రోల్లో పట్టాలెక్కబోతోంది. నందినీ రెడ్డి ఎమోషన్స్కు రాజ్ అండ్ డీకే యాక్షన్ తోడవుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.