E-Paper
Advertisement

తెలంగాణలో 14 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు.. సుప్రీంలో సంచలన నివేదిక!

తెలంగాణలో 14 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు.. సుప్రీంలో సంచలన నివేదిక!
Advertisement

Telangana MPs: తెలంగాణకు చెందిన 14 మంది ఎంపీలపై కేసులు నమోదై ఉన్నట్టుగా అమికస్​ క్యూరీ సుప్రీం కోర్టుకు నివేదికను సమర్పించింది. దాంతోపాటు దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులపై 4,192 కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్​ లో ఉన్నట్టుగా తెలియచేసింది.

దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల వివరాలతో రూపొందించిన సమగ్ర నివేదికను అమికస్ క్యూరీ సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. విచారణ ప్రక్రియను వేగవంతం చేయటంతో 2025వ సంవత్సరం చివరికి 1,243 కేసుల విచారణ ముగిసినట్టుగా పేర్కొంది. అయితే అదే సమయంలో కొత్తగా 1,050 కేసులు నమోదయ్యాయని తెలిపింది.

Advertisement

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజా ప్రతినిధులపై 4,192 కేసులు కోర్టుల్లో పెండింగ్​ లో ఉన్నట్టుగా పేర్కొంది. పదేళ్లకు పైగా ఎలాంటి తీర్పు తేలకుండా 519 కేసులు ఉన్నట్టుగా తెలియచేసింది. ఇక, తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులపై కూడా కేసులు ఉన్నట్టుగా పేర్కొంది. రాష్ట్రానికి చెందిన 14మంది ఎంపీలపై తీవ్రమైన నేరారోపణల మీద కేసులు నమోదై ఉన్నట్టుగా పేర్కొంది.

Also Read: టిమ్స్ క్రెడిట్ కేటీఆర్‌దా? ఎర్రగడ్డలో షాకిస్తే సెట్ అవుతుంది.. సీఎం రేవంత్ సెటైర్లు

Advertisement

తెలంగాణ ఎంపీలపై హత్యాయత్నం వంటి నేరారోపణలు కూడా ఉన్నట్టుగా తెలిపింది. రోజువారీ విచారణ జరిపి కేసులను వీలైనంత తక్కువ సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టును కోరింది.

Also Read: మంత్రి ప‌ద‌వి ఇచ్చేదాకా ఇదే తీరు..! ఇవ్వ‌డానికి చాన్సు లేదు.. కోమ‌టిరెడ్డి మారేదీ లేదూ!

Tags

Related News

రెండో పెళ్లి చేసుకుంటే.. ఉద్యోగుల జీతాల్లో 20% కోత.. సీఎం సంచలన ప్రకటన

బీజేపి కొత్త కార్యవర్గం.. జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వరి.. స్మృతి ఇరానీకి కీలక పదవి!

వందేమాతరం వివాదం.. సోనియా, రాహుల్‌పై పోలీసు కంప్లైంట్.. అసలేం జరిగిందంటే?

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే!

మోదీ జీ.. మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి! – రాహుల్ గాంధీ

బిహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి!

బిగ్ బ్రేకింగ్.. మరోసారి రీ ఎగ్జామ్ కు సిద్ధమైన NTA

Big Stories

Advertisement
×