Noida: ఈ మధ్యకాలంలో మైనర్లు ఎక్కువగా వాహనాలు నడుపుతూ బుక్కవుతున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్నారు కూడా. అయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను డ్రైవింగ్ చేయాలని మైనర్లను ప్రొత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా అలాంటి ఘటన నోయిడా చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
నోయిడాలో 15 ఏళ్ల బాలుడు కారు నడుపుతూ మరో కారుని బలంగా ఢీ కొట్టాడు. దెబ్బతిన్న కారులో పసికందుతో ఓ తల్లి ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటన తర్వాత స్థానికులు కారు ఆపడంతో ఆ బాలుడు పారిపోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఘటన గురించి తెలియగానే బాలుడి తల్లి అక్కడికి చేరుకుంది. కుటుంబ డ్రైవర్ అందుబాటులో లేడని, అందుకే బాలుడు డ్రైవింగ్ చేశాడంటూ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ ఘటన తల్లిదండ్రుల బాధ్యత-మైనర్ల డ్రైవింగ్పై విమర్శలకు దారి తీసింది.
మైనర్ను వాహనం నడపడానికి ఎవరు అనుమతించారని దెబ్బతిన్న కారు యజమాని ప్రశ్నించడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది.ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఘటనా స్థలంలో ఉన్నవారు యువకుడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని ప్రశ్నించగా, ఆ బాలుడు, అతడి తల్లి లైసెన్స్ లేదని ఒప్పుకున్నట్లు సమాచారం. కొడుకును వెనుకేసుకు వచ్చిన తల్లి వివరణపై ఆన్లైన్లో విమర్శలు తీవ్రమయ్యాయి. బహిరంగ రహదారిపై మైనర్ కారు నడపడానికి ఎలా అనుమతించారని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ప్రమాదానికి గురైన వాహనంలో పసిబిడ్డ ఉండటంతో ఈ ఘటనపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ ఘటనలో కారు ఢీ కొనడం వల్ల మరొక కారుకి తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ అందులో ఉన్నవారు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. లైసెన్స్ లేని మైనర్ను వాహనం నడపడానికి అనుమతించడం వల్ల ఇతర వినియోగదారులను ప్రమాదంలో పడేస్తుందని చెప్పడానికి ఈ సంఘటన వెలుగులోకి తెచ్చింది. ప్రమాదం వేరే విధంగా జరిగి ఉంటే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
ALSO READ: కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులపై దాడి.. పలువురికి గాయాలు, ఇంతకీ అక్కడ-ఏం జరిగింది?
ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మైనర్లు వాహనాలు నడపకుండా నిరోధించేందుకు తల్లిదండ్రులు-వాహన యజమానులు బాధ్యత వహించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో తల్లిదండ్రులను బాధ్యులుగా చేయాలని, వారికి ఒక్క రోజు శిక్ష విధించి కోరుతున్నారు. మైనర్ చేత కారు నడిపించిన తల్లిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.