BigTV English

Salary Scam: 50,000 నకలీ ప్రభుత్వ ఉద్యోగులు.. రూ.230 కోట్ల వేతన కుంభకోణం

Salary Scam: 50,000 నకలీ ప్రభుత్వ ఉద్యోగులు.. రూ.230 కోట్ల వేతన కుంభకోణం

Salary Scam Madhya Pradesh| ఒక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో భారీ కుంభకోణం జరిగింది. ఏకంగా 50,000 నకిలీ ఉద్యోగుల వేతనం పేరుతో ప్రభుత్వ రికార్డుల్లో రూ.230 కోట్ల దోపిడీ జరిగినట్లు తెలిసింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లో 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో సుమారు 9 శాతం మంది. గత ఆరు నెలలుగా జీతాలు పొందలేదు. ఈ రహస్యం రాష్ట్ర యంత్రాంగం ఫైళ్లలో దాగి ఉంది, కానీ ఇది మధ్యప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద జీతాల కుంభకోణంగా జాతీయ మీడియా పేర్కొంది.


ఈ ఉద్యోగులు అధికారిక రికార్డులలో ఉన్నారు. వారికి పేరు, ఉద్యోగి కోడ్ ఉన్నాయి, కానీ ఆరు నెలలుగా వారి జీతాలు చెల్లించబడలేదు. వీరు జీతం లేని సెలవులో ఉన్నారా? సస్పెన్షన్‌లో ఉన్నారా? లేక వీరు కేవలం ‘ఘోస్ట్’ ఉద్యోగులా? అనేది తేలడం లేదు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వ విభాగంలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు (డీడీవోలు -వేతన ఉపసంహరణ ఆఫీసర్లు).. మే 23న ట్రెజరీ అండ్ అకౌంట్స్ కమిషనర్ (సీటీఏ) ఒక లేఖ రాశారు. ఈ లేఖలో డిసెంబర్ 2024 నుంచి జీతాలు తీసుకోని ఉద్యోగుల డేటాను పరిశీలించాలని కోరారు. ఈ ఉద్యోగులకు ఉద్యోగి కోడ్‌లు ఉన్నప్పటికీ.. వారి వివరాలు ధృవీకరించబడలేదు, వారి నిష్క్రమణ ప్రక్రియ కూడా పూర్తి కాలేదు.


ఈ లేఖ తర్వాత, 6,000 మంది డీడీవోలు పరిశీలనలో ఉన్నారు. రూ. 230 కోట్ల అవతవకల గురించి 15 రోజుల్లో వివరించాలని ఆదేశించారు. ఈ గడువు ఈ రోజుతో ముగుస్తుంది. “మేము డేటా విశ్లేషణ చేస్తున్న సమయంలో.. ఈ వ్యత్యాసం కనిపించింది. ఈ ఉద్యోగుల ఖాతాల నుంచి జీతాలు తీసుకోబడలేదు. మేము చేస్తున్న భవిష్యత్తులో జరగబోయే మోసాలను అరికట్టడానికి,” అని సీటీఏ కమిషనర్ భాస్కర్ లక్ష్కర్ చెప్పారు.

ట్రెజరీ విభాగం రాష్ట్రవ్యాప్తంగా ధృవీకరణ ప్రక్రియ ప్రారంభించింది. ప్రతి డీడీవో తమ కార్యాలయంలో అనధికార ఉద్యోగులు లేరని ధృవీకరించాలి. “సస్పెన్షన్‌లు, బదిలీలు వంటి నిజమైన కారణాలు ఉండవచ్చు. కానీ ఆరు నెలలుగా జీతం రాకపోతే, నిష్క్రమణ ప్రక్రియ కూడా జరగకపోతే, అది సమస్యే,” అని ఒక సీనియర్ ఆర్థిక అధికారి చెప్పారు.

ఆర్థిక మంత్రి స్పందన ఈ విషయంపై ఒక జాతీయ మీడియా మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి జగదీష్ దేవదాను సంప్రదించింది. “50,000 మంది జీతాలు ఆరు నెలలుగా రాలేదు, ఎందుకు?” అని అడిగినప్పుడు, ఆయన అసౌకర్యంగా కనిపించి, “ఏ ప్రక్రియ జరిగినా, అది నియమాల ప్రకారం జరుగుతుంది,” అని చెప్పారు. మళ్లీ అడిగినప్పుడు, “అంతా నియమాల ప్రకారమే జరుగుతుంది,” అని మళ్లీ మళ్లీ అదే తప్పు చేసి లోపలికి వెళ్లిపోయారు.

Also Read: కింగ్‌ఫిషర్ నష్టాలకు ప్రణబ్ ముఖర్జీ కారణం.. విజయ్ మాల్యా షాకింగ్ వ్యాఖ్యలు

ఈ 50,000 మందిలో 40,000 మంది శాశ్వత ఉద్యోగులు, 10,000 మంది తాత్కాలిక సిబ్బంది. వారి జీతాలు మొత్తం రూ. 230 కోట్లు. జీతాలు చెల్లించకపోవడంతో, గోస్ట్ ఉద్యోగులు లేదా పెద్ద ఎత్తున మోసం జరిగిందనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ రూ. 230 కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఈ ఉద్యోగులలో కొంతమంది గోస్ట్ ఉద్యోగులైతే, ఎవరు ఈ వ్యవస్థను మోసం చేస్తున్నారు? ఈ 9 శాతం ఉద్యోగులు లేకుండా విభాగాలు ఎలా నడుస్తున్నాయి? ఈ కుంభకోణం వెనుక ఉన్న రహస్యాలను వెలికితీసేందుకు పరిశోధన కొనసాగుతోంది.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×