E-Paper
Advertisement

Firecracker Explodes Kerala: కేరళ వేడుకల్లో విషాదం.. బాణసంచా పేలి 154 మంది గాయాలు, మరో

Firecracker Explodes Kerala: కేరళ వేడుకల్లో విషాదం.. బాణసంచా పేలి 154 మంది గాయాలు, మరో
Advertisement

Firecracker Explodes Kerala: కేరళలోని ఓ ఫెస్టివల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆ ఘటనలో 154 మంది గాయపడ్డారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. అసలేం జరిగింది అన్న లోతుల్లోకి వెళ్తే…

కేరళ కసరగడ్ జిల్లా నీలేశ్వర్‌లోని అంజూతంబళం వీరెర్కవు ఆలయంలో వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం ఆ జిల్లాకు చెందినవారే కాకుండా పొరుగు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అక్కడికి వచ్చారు. సంప్రదాయ తెయ్యం పండుగంటే ఆ సరదా అంతా ఇంతా కాదు.

Advertisement

పండగ సందర్భంగా అర్థరాత్రి బాణాసంచా పేల్చారు. పేలిన టపాసుల రవ్వలు బాణసంచా నిల్వచేసిన గదిలో పడ్డాయి. దీంతో భారీ ఎత్తున శబ్దాలు, మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో భక్తులు బయట వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.

ఈ ఘటనలో 154 మంది గాయపడినట్టు తెలుస్తోంది. మరో 18 మందికి తీవ్ర గాయాలు కాగా, 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటన విషయం తెలియగానే అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ ప్రాంతానికి పోలీసులు, అధికారులు చేరుకుని సహాయ చర్యలు ముమ్మరంగా చేశారు.

Advertisement

ALSO READ: తిరువనంతపురం.. సీఎం విజయన్‌కు తప్పిన ముప్పు

గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×