E-Paper
Advertisement

Vidyasagar Maharaj: జైన గురువు ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ కన్నుమూత.. మోదీ సంతాపం..

Vidyasagar Maharaj: జైన గురువు ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ కన్నుమూత.. మోదీ సంతాపం..
Advertisement

Jain Seer Acharya Vidyasagar Maharaj: జైన మత ధర్మకర్త, ముని ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ ఇకలేరు. ఆదివారం ఆయన కన్నుమూశారు. చత్తీస్‌గఢ్‌ డోంగర్‌గఢ్‌ తీర్థంలో కొన్ని రోజులుగా విద్యాసాగర్ మహారాజ్ దీక్షలో ఉన్నారు. సల్లేఖనదీక్ష చేపట్టి మూడు రోజులుగా ఆహార, పానీయాలు తీసుకోవడం మానేశారు. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తుదిశ్వాస విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయారు.

ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. జైన మత గురువు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. ఆయన సేవ చిరస్మరణీయమని ప్రశంసించారు. పేదరిక నిర్మూలన కోసం ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ పాటుపడ్డారని కొనియాడారు. ప్రజల ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారని తెలిపారు.

Advertisement

విద్యాభివృద్ధికి కోసం జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ పేర్కొన్నారు. గతేడాది ఆచార్యను కలిసిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో జైన గురువు ఆశీస్సులు తీసుకోవడం తన అదృష్టంగా పేర్కొన్నారు.

Read More: జ్ఞాన్ పీఠ్ గ్రహీతలు గుల్జార్, రామభద్రాచార్యులు.. వారి జీవిత విశేషాలివే..

Advertisement

సమాజాభివృద్ధికి కోసం ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ చేసిన కృషి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. ఆచార్యతో కలిసి దిగిన ఫోటోను ప్రధాని షేర్‌ చేశారు. ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్ మృతిపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ సంతాపం ప్రకటించారు.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×