E-Paper
Advertisement

Vidyasagar Maharaj: జైన గురువు ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ కన్నుమూత.. మోదీ సంతాపం..

Vidyasagar Maharaj: జైన గురువు ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ కన్నుమూత.. మోదీ సంతాపం..

Jain Seer Acharya Vidyasagar Maharaj: జైన మత ధర్మకర్త, ముని ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ ఇకలేరు. ఆదివారం ఆయన కన్నుమూశారు. చత్తీస్‌గఢ్‌ డోంగర్‌గఢ్‌ తీర్థంలో కొన్ని రోజులుగా విద్యాసాగర్ మహారాజ్ దీక్షలో ఉన్నారు. సల్లేఖనదీక్ష చేపట్టి మూడు రోజులుగా ఆహార, పానీయాలు తీసుకోవడం మానేశారు. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తుదిశ్వాస విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయారు.

ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. జైన మత గురువు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. ఆయన సేవ చిరస్మరణీయమని ప్రశంసించారు. పేదరిక నిర్మూలన కోసం ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ పాటుపడ్డారని కొనియాడారు. ప్రజల ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారని తెలిపారు.

విద్యాభివృద్ధికి కోసం జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ పేర్కొన్నారు. గతేడాది ఆచార్యను కలిసిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో జైన గురువు ఆశీస్సులు తీసుకోవడం తన అదృష్టంగా పేర్కొన్నారు.

Read More: జ్ఞాన్ పీఠ్ గ్రహీతలు గుల్జార్, రామభద్రాచార్యులు.. వారి జీవిత విశేషాలివే..

సమాజాభివృద్ధికి కోసం ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ చేసిన కృషి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. ఆచార్యతో కలిసి దిగిన ఫోటోను ప్రధాని షేర్‌ చేశారు. ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్ మృతిపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ సంతాపం ప్రకటించారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×