BigTV English
Advertisement

Adani Group: చ‌ట్టాల‌కు లోబ‌డే న‌డుచుకుంటాం.. రూ.2000 కోట్ల లంచం ఆరోప‌ణ‌ల‌పై అదానీ గ్రూప్

Adani Group: చ‌ట్టాల‌కు లోబ‌డే న‌డుచుకుంటాం.. రూ.2000 కోట్ల లంచం ఆరోప‌ణ‌ల‌పై అదానీ గ్రూప్

Adani Group: సోలార్ ప‌వ‌ర్ కాంట్రాక్టుల కోసం లంచం ఇవ్వ‌డానికి చూశారంటూ అమెరికా ప్రాసిక్యూట‌ర్స్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను అదానీ గ్రూప్స్ ఖండిచింది. ఆ ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వని అభిప్రాయ‌ప‌డింది. చ‌ట్టాల‌కు లోబ‌డే త‌మ గ్రూప్ న‌డుచుకుంటుంద‌ని పేర్కొంది. న్యాయప‌రంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దోషులుగా తేలే వ‌ర‌కు నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. పాల‌నా వ్య‌వ‌హారాల్లో, పార‌ద‌ర్శ‌క‌త విష‌యంలో అదానీ గ్రూప్స్ ఎప్పుడూ అత్యున్న‌త ప్ర‌మాణాల‌ను పాటిస్తోంద‌ని తెలిపారు.


Also read: అదానీ దేశసంప‌ద కొల్ల‌గొట్టాడు.. ఆయ‌న వెన‌కుంది మోడీనే: రాహుల్ గాంధీ

తాము కార్య‌కలాపాలు నిర్వ‌హించే ప్ర‌తిచోటా దీనిని పాటిస్తామ‌ని పేర్కొన్నారు. చ‌ట్టాల‌కు లోబ‌డి వ్య‌వ‌హ‌రిస్తూ వాటిని గౌర‌విస్తామ‌ని, పెట్టుబ‌డిదారులు, వాటాదారులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉంటే సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టులు ద‌క్కించుకోవ‌డంలో భాగంగా అదానీ గ్రూప్ రూ.2.100 కోట్లు లంచం ఇవ్వాల‌నుకున్నార‌ని, దీని గురించి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని అమెరికా ప్రాసిక్యూట‌ర్స్ ఆరోప‌ణ‌లు చేశారు.


దీంతో గౌత‌మ్ అదానీ స‌హా మ‌రో ఏడుగురిపై కేసులు న‌మోద‌య్యాయ‌ని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఈ దెబ్బ‌తో అదానీ స్టాక్స్ భారీగా ప‌త‌నం అయ్యాయి. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. అదానీ గ్రూప్స్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న ప్ర‌భుత్వాల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంతో బీజేపీపై నేత‌లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దేశంలో ప్ర‌ధాని అండ‌తో అదానీ కుంభ‌కోణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ అదానీని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

Related News

PM Modi: సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌కు.. ప్రధానీ మోదీ నివాళి

Bengaluru: బెంగళూరులో చెత్తను ఇళ్ల గుమ్మం వద్ద వేస్తున్న మున్సిపల్ అధికారులు.. ఎందుకంటే!

Fake Eno: మార్కెట్ లో నకిలీ ఈనో ప్యాకెట్లు.. ఈజీగా గుర్తు పట్టాలంటే ఇలా చేయండి

Justice Suryakanth: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. నవంబర్ 24న బాధ్యతలు

Jammu and Kashmir: లష్కరే తోయిబా ఉగ్రవాదులతో ఉగ్ర సంబంధాలు.. ఇద్దరు ప్రభుత్వ టీచర్లపై వేటు..

Children Kidnap: ముంబైలో 20 మంది పిల్లల కిడ్నాప్ కలకలం.. నిందితుడి ఎన్‌కౌంటర్

Boat Capsized In UP: యూపీలో ఘోరం.. నదిలో పడవ బోల్తా, ఎనిమిది మంది మృతి!

Manufacturing Hub: మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్! మోదీ ప్యూచర్ ప్లాన్ ఏంటీ?

Big Stories

×