E-Paper
Advertisement

Minister Caught: అసెంబ్లీలో కెమెరాకు చిక్కిన మంత్రి.. ఫోన్ ఓపెన్ చేసి, ఓ రేంజ్‌లో ఆడేస్తున్నారు

Minister Caught: అసెంబ్లీలో కెమెరాకు చిక్కిన మంత్రి.. ఫోన్ ఓపెన్ చేసి, ఓ రేంజ్‌లో ఆడేస్తున్నారు
Advertisement

Minister Caught: రాజకీయ నేతలు రూటు మార్చారా? నిత్యం ప్రజా సమస్యలతో తీరిక లేకుండా గడుపుతున్నారా? అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సమయం దొరుకుతుందా? గడిపిన కొద్ది క్షణాల్లో తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లకు పని చెబుతున్నారా? తాజాగా అసెంబ్లీలో ఓ మంత్రి రమ్మీ గేమ్ అడుతూ అడ్డంగా కెమెరా చిక్కారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏంటి? ఎక్కడ అనేది చూద్దాం.

అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై చర్చ జరుగుతాయి. లేకుంటే అధికార పార్టీని ఓ ఆటాడుకుంటుంది ప్రతిపక్షం. ఆయా శాఖల గురించి ఏ చిన్న సమచారం దొరికినా ఆయా మంత్రులకు ఇబ్బందులు తప్పవు. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. రైతుల ఆత్మహత్యలపై చర్చ జరుగుతోంది.

Advertisement

ఈ విషయంలో సదరు వ్యవసాయశాఖ మంత్రి మాణిక్ రావ్ కోకటే ఏమనుకున్నారో తెలీదు. తీరిగ్గా తన స్మార్ట్ ఫోన్‌ ఓపెన్ చేసి రమ్మీ ఆడుకుంటూ కనిపించారు. జాకీ కోసం ఆయన తెగ వెతుకులాట మొదలుపెట్టారు. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యే ఒకరు వీడియో షూట్ చేసి విపక్షాలకు అందజేశారు. సదరు మంత్రిని ఆటాడుకోవడం విపక్షాల వంతైంది.

శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ రోహిత్ పవార్ సదరు మంత్రిపై మండిపడ్డారు. అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి మాణిక్ రావ్ కోకటే రమ్మీ ఆడుతున్న వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రైతాంగం తీవ్ర ఇబ్బందులో ఉందని, సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం మొగ్గుచూపడం లేదని ఆరోపించారు.

Advertisement

ALSO READ: ఉపవాసమున్న భార్యను కొట్టిన యువకుడు, కట్ చేస్తే ఇంట్లో అతని శవం

పంట బీమా కోసం, రుణ మాఫీ కోసం, పంటలకు మద్దతు ధర కోసం రైతులు పోరాడుతున్నారని, ఈవిషయాలేమీ పట్టకుండా సదరు మంత్రి తీరిగ్గా రమ్మీ ఆడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అప్పులపాలైన రైతులు రోజుకి ఎనిమిది మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్సీపీ నేత రోహిత్ పవార్.

వ్యవసాయ మంత్రికి చీమ కుట్టినట్లు లేదన్నారు. రమ్మీ ఆటను పక్కన పెట్టి అప్పుడప్పుడు రైతుల వద్దకు వచ్చిన సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. మంత్రి రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అన్నట్లు చాన్నాళ్ల కిందట కర్ణాటక అసెంబ్లీలో ఏకాంతం వీడియోలు చూస్తూ కెమెరాకి చిక్కారు ఓ ఎమ్మెల్యే. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ వేదికైంది.

 

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×