E-Paper
Advertisement

DGCA fined Rs.30 lakhs: ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా.. తగినన్ని వీల్‌ఛైర్‌లు అందించాలని డీజీసీఏ ఆదేశాలు..

DGCA fined Rs.30 lakhs: ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా.. తగినన్ని వీల్‌ఛైర్‌లు అందించాలని డీజీసీఏ ఆదేశాలు..

DGCA fined Rs.30 lakhs to Air India

DGCA fined Rs.30 lakhs to Air India: విమాన సేవల్లో అలసత్వం వహించినందుకు ఎయిరిండియాకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ రూ.30 లక్షల జరిమానా విధించింది. విమానయాన సంస్థకు వీల్‌ఛైర్‌ కొరతతో విమానం నుంచి టెర్మినల్‌ బిల్డింగ్‌ వరకు నడిచిన 80 ఏళ్ల వృద్ధ ప్రయాణికుడు మరణించిన విషయం తెలిసిందే.

ఓ వృద్ధ దంపతులు అమెరికా నుంచి ఎయిరిండియా విమానంలో ముంబయికి వచ్చారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విమానాశ్రయంలో ఫిబ్రవరి 12న దిగారు. వీల్‌ఛైర్‌ సదుపాయం లేక ఆ వృద్ధుడు విమానం నుంచి టెర్మినల్‌ బిల్డింగ్‌ వరకు నడుచుకుంటూ వచ్చి.. ఒక్కసారిగా కుప్పుకూలిపోయారు.

ఘటనకు స్పందించిన సిబ్బంది వెంటనే ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ వృద్ధుడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937 ప్రకారం ఎయిరిండియాపై రూ. 30 లక్షల జరిమానా విధించింది.

Read More: టీఎంసీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్.. 10 రోజుల పోలీసు కస్టడీ..

అనంతరం షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20న ఈ నోటీసుకు ఎయిరిండియా తన ప్రతిస్పందనను సమర్పించింది. వృద్ధ ప్రయాణికుడి భార్యకు ఒక వీల్‌ఛైర్‌ ఇచ్చారని మరో వీల్‌ఛైర్‌ ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని ఆయనకు తెలిపామన్నారు. ఆ వృద్ధుడు తమ మాట వినకుండా టెర్మినల్‌ దాక నడిచి వెళ్లారని వివరణ ఇచ్చింది.

దీంతో డీజీసీఏ ఎయిరిండియాకు రూ. 30 లక్షలు జరిమానా విధించింది. ప్రయాణ సమయంలో విమానం ఎక్కేటప్పుడు లేదా దిగే సమయంలో సహాయం అవసరమయ్యే ప్రయాణికుల కోసం తగిన సంఖ్యలో వీల్‌చైర్లు అందుబాటులో ఉండేలా అన్ని ఎయిర్‌లైన్స్‌లకు ఒక సలహా కూడా జారీ చేసింది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×