BigTV English
Advertisement

Air India Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. 4 గంటలు ప్రయాణం తర్వాత వెనక్కి మళ్లింపు

Air India Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. 4 గంటలు ప్రయాణం తర్వాత వెనక్కి మళ్లింపు

Air India Bomb Threat| ఇటీవల విమానాల్లో బాంబులున్నట్లు బెదిరింపులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ బెదిరింపులు ఫోన్ కాల్స్ లేదా ఈ మెయిల్స్ రూపంలో వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపు వచ్చింది. విమానం గాల్లో ఉండగానే ఈ బెదిరిపులు రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నాలుగు గంటలపాటు ప్రయాణం చేసిన తరువాత ఈ బెదిరింపు రావడంతో పైలట్లు తిరిగి బయలు దేరిన స్థానానికి మళ్లించారు. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఈ విమానాన్ని పైలట్లు టేకాఫ్ అయినచోటే దింపారు (Mumbai-New York). జాతీయ మీడియా కథనాల ప్రకారం..


బోయింగ్ 777 విమానం ముంబై నుంచి న్యూయార్క్ వెళుతోంది. నాలుగు గంటల తర్వాత అజర్‌బైజాన్ ప్రాంతంలో ఆకాశంలో ఉండగా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు (Bomb threat) వచ్చాయి. సిబ్బందికి ఈ బెదిరింపులు రావడంతో.. వెంటనే అప్రమత్తమైన పైలట్లు తిరిగి ముంబై వైపు విమానాన్ని మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే విమానంలో బాంబు ఎక్కడుందో కనిపెట్టడానికి బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి.. తనిఖీలు చేపట్టింది. అయితే బాంబు లాంటిదేమీ లేదని ఎవరో నకిలీ కాల్ చేశారని అని తెలుస్తోంది.

Also Read: మహిళలు ఒక హత్య చేసినా శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్య


శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన  ప్రమాదం

గోవా నుంచి వస్తున్న విమాన సర్వీస్కు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో ఎయిర్ లైన్స్  6E-6973 విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ మీదుగా విశాఖపట్నంకు బయలుదేరింది. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ విమానం హైడ్రాలిక్ గేర్‌ను సిద్ధం చేశాడు.

రన్వేపై టేకాఫ్ అవుతున్న మరో విమానం

విమాన సర్వీస్ను డౌన్ చేసిన పైలట్ అప్పటికే రన్వేపై టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించాడు. దీంతో వెంటనే అప్రమత్తమై విమానాన్ని గాల్లోకి లేపాడు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. 10 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం విమానాన్ని ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ విమాన సర్వీస్ విశాఖపట్నంనకు వెళ్లిపోయింది.

Related News

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Big Stories

×