BigTV English
Advertisement

Lok Sabha: అఖిలేష్ Vs అమిత్ షా.. దద్దరిల్లిన లోక్‌సభ

Lok Sabha: అఖిలేష్ Vs అమిత్ షా.. దద్దరిల్లిన లోక్‌సభ

Lok Sabha: పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లోక్ సభలో కేంద్రమంత్రి అమిత్ షా, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో కొద్ది సేపు లోక్ సభలో ఆందోళన వాతావరణం ఏర్పడింది. స్పీకర్ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.


అఖిలేశ్ మాట్లాడుతూ.. ‘లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హక్కులతోపాటు ప్రతిపక్ష ఎంపీల హక్కులను కాలరాస్తున్నారు. అంతేకాదు.. స్పీకర్ హక్కులను లాక్కుంటున్నారు. మీ తరఫున మేం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ అఖిలేశ్ ప్రసంగించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అమిత్ షా.. అఖిలేశ్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది సభాపతిని అవమానించడమేనంటూ అమిత్ షా నిప్పులు చెరిగారు. స్పీకర్ హక్కులకు ప్రతిపక్షాలు పరిరక్షకులు కాదంటూ ఆయన మండిపడ్డారు.

Also Read: హసీనాకు పట్టిన గతే మోదీకి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు


‘సభలో అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది స్పీకర్ పదవిని పూర్తిగా అవమానించడమే అవుతుంది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ హక్కుల పరిరక్షకులు కాదు.. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి’ అంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. అనంతరం ఇదే అంశానికి సంబంధించి స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. స్పీకర్ ను ఉద్దేశించి సభ్యులెవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ సూచించారు.

ఇదిలా ఉంటే.. వక్ఫ్ చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. దీనిపై సభలో చర్చను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Related News

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Big Stories

×