E-Paper
Advertisement

Lok Sabha: అఖిలేష్ Vs అమిత్ షా.. దద్దరిల్లిన లోక్‌సభ

Lok Sabha: అఖిలేష్ Vs అమిత్ షా.. దద్దరిల్లిన లోక్‌సభ

Lok Sabha: పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లోక్ సభలో కేంద్రమంత్రి అమిత్ షా, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో కొద్ది సేపు లోక్ సభలో ఆందోళన వాతావరణం ఏర్పడింది. స్పీకర్ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

అఖిలేశ్ మాట్లాడుతూ.. ‘లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హక్కులతోపాటు ప్రతిపక్ష ఎంపీల హక్కులను కాలరాస్తున్నారు. అంతేకాదు.. స్పీకర్ హక్కులను లాక్కుంటున్నారు. మీ తరఫున మేం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ అఖిలేశ్ ప్రసంగించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అమిత్ షా.. అఖిలేశ్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది సభాపతిని అవమానించడమేనంటూ అమిత్ షా నిప్పులు చెరిగారు. స్పీకర్ హక్కులకు ప్రతిపక్షాలు పరిరక్షకులు కాదంటూ ఆయన మండిపడ్డారు.

Also Read: హసీనాకు పట్టిన గతే మోదీకి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

‘సభలో అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది స్పీకర్ పదవిని పూర్తిగా అవమానించడమే అవుతుంది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ హక్కుల పరిరక్షకులు కాదు.. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి’ అంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. అనంతరం ఇదే అంశానికి సంబంధించి స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. స్పీకర్ ను ఉద్దేశించి సభ్యులెవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ సూచించారు.

ఇదిలా ఉంటే.. వక్ఫ్ చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. దీనిపై సభలో చర్చను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×