BigTV English
Advertisement

Anurag Thakur: ‘కులమే లేనివాడు కులగణన గురించి మాట్లాడుతున్నాడు’.. రాహుల్ గాంధీని అవమానిస్తూ.. అనురాగ్ ఠాకుర్ వ్యాఖ్యలు

Anurag Thakur: ‘కులమే లేనివాడు కులగణన గురించి మాట్లాడుతున్నాడు’.. రాహుల్ గాంధీని అవమానిస్తూ.. అనురాగ్ ఠాకుర్ వ్యాఖ్యలు

Anurag Thakur Rahul Gandhi Lok Sabha Debate: పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ చర్చల సందర్భంగా కులగణన అంశంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, బిజేపీ ఎంపీ అనురాగ్ ఠాకుర్ మధ్య మంగళవారం మాటలయుద్ధం జరిగింది. ఈ క్రమంలో అనురాగ్ ఠాకుర్.. రాహుల్ గాంధీకి అసలు కులమే లేదు.. అంటూ అవమానకర వ్యాఖ్యలు చేయగా.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదర్ రాహుల్ గాంధీకి మద్దతుగా అధికార కూటమి పార్టీ ఎంపీల ప్రవర్తను తప్పుబట్టారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు లోక్ సభలో ఠాకుర్ వ్యాఖ్యాల పట్ల నిరసన చేశారు. దీంతో లోక్ సభ వాతావరణం వేడెక్కింది.


అనురాగ్ ఠాకుర్ ఏమన్నారంటే..
లోక్ సభ వర్షకాల సెషన్ లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు కులగణన అంశం లేవనెత్తారు. దేశంలో కులగణన జరగాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ వాదించారు. దీనిపై బిజేపీ ఎంపీ అనురాగ్ ఠాకుర్ స్పందిస్తూ.. ”కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రధాన మంత్రుల సమయంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ఇప్పుడు వీళ్లేమో వెనుకబడిన కులాల గురించి ఓబిసీల గురించి మాట్లాడుతున్నారు. వీళ్లకు అసలు ఓబీసీ అంటే ఓన్లీ బ్రదర్ ఇన్ లా కమిషన్ (రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను ఉద్దేశిస్తూ). తన కులమేదో తెలియన వ్యక్తి కులగణన గురించి మాట్లాడుతున్నాడు. అసత్యానికి కాళ్లు ఉండవంటారు. అందుకే రాహుల్ గాంధీ తన భూజాలపై అసత్యన్ని మోసుకొస్తున్నారు ” అని రాహుత్ గాంధీని ఎద్దేవా చేశారు.

ఠాకుర్ చేసిన అవమానకర వ్యాఖ్యల తరువాత కాంగ్రెస్ ఎంపీలు, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు బిజేపీ ఎంపీలు కూడా వారికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఇరు వర్గాల మధ్య దూషణ పర్వం మొదలైంది.


రాహుల్ గాంధీ స్పందన
అనురాగ్ ఠాకుర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ముందుగా కాంగ్రెస్ ఎంపీలను శాంతపరిచి ఆ తరువాత మాట్లాడుతూ.. ”దళితుల గురించి, వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే వారిని బిజేపీ వాళ్లు అవమానిస్తూనే ఉంటారు. నన్ను అవమానించడం వాళ్లకు అలవాటై పోయింది. వీళ్లు ఎన్నిసార్లు నన్ను అవమానించినా సరే. అర్జునుడి గురి చేప కన్ను మీద ఉన్నట్లు నా లక్ష్యం కులగణన మీదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కులగణన చేపించే తీరుతుంది” అని అన్నారు.

రాహుల్ గాంధీ కులం గురించి బిజేపీ నాయకులు అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఖండించారు. ”పార్లమెంటులో ఒక సభ్యుడి కులం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఇది నిబంధనలకు వ్యతిరేకం,” అని అన్నారు.

Also Read: కేంద్ర ప్రభుత్వానికి భారీ సుప్రీం కోర్టు హెచ్చరిక.. నవంబర్ 14 లోగా..

 

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×